పట్టుపురుగులు ఆకు తింటున్న తీరును పరిశీలిస్తున్న ఈ రైతు పేరు కిషన్రెడ్డి. ఇతడిది రామడుగు మండలం గోపాల్రావుపేట. తనకున్న రెండెకరాల్లో గతంలో అరటి, బొప్పాయి వంటి పంటలు వేశాడు. అధికారుల సూచనల మేరకు ఐదేళ్ల నుంచి పట్టు సాగువైపు మళ్లారు. ప్రస్తు తం 250 గుడ్ల వరకు పెంచుతున్నారు. ప్రతి నెలా రెండున్నర క్వింటాళ్ల పట్టుగూళ్ల్లు దిగుబడి తీస్తున్నారు. ఏడాదికి పది పంటలు తీస్తున్నా డు. ప్రస్తుతం మార్కెట్లో కిలో పట్టుగూళ్ల ధర రూ.500వరకు ఉంది. ఒక్కో పంటకు రూ.20 వేల వరకు ఖర్చు ఉంటుందని, సంప్రదాయ పంటలతో పోల్చితే పట్టు ద్వారా ప్రతి నెలా ఆదాయం వస్తుందని పేర్కొంటున్నాడు.
ముకరంపుర, జూలై 3: రైతులు సంప్రదాయ సాగుకు స్వస్తిచెప్పి విభిన్న పంటల సాగుకు మొగ్గుచూపుతున్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉ న్న పట్టు పురుగుల పెంపకంపై ఆసక్తి చూపుతు న్నారు. సర్కారు ఇస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకుంటూ లాభాల బాటలో ముందుకెళ్తున్నా రు. ప్రతినెలా రాబడి వస్తుండడంతో ఆనందంలో మునిగితేలుతున్నారు. ప్రస్తుతం తగినంత ఉత్పత్తి లేకపోవడంతో మార్కెట్లో పట్టుకు మంచి డి మాండ్ ఉన్నది. ప్రభుత్వమే పట్టు గూళ్లు కొనుగో లు చేయడం. గతంతో పోల్చితే మార్కెట్లో మం చి ధర లభిస్తుండడం, తక్కువ శ్రమ, నీటి వినియోగంతో ఏటా ఎనిమది పంటలు తీస్తూ రైతు లు లాభాలు గడిస్తున్నారు.
92 మంది రైతులు.. 268 ఎకరాలు..
తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం లభించే పట్టు పురుగుల పెంపకానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 92మంది రైతులు 268ఎకరాల్లో మల్బరీని సాగు చేస్తూ పట్టు పురుగులను పెంచుతున్నారు. ఎకరం వరి సాగుచేసే నీ టితో మూడెకరాల మల్బరీ తోటను పెంచవచ్చు. పట్టు పరిశ్రమ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టిన రైతులకు అందుబాటులో ఉంటూ సూచనలిస్తున్నారు.
ఏడాదికి ఎనిమిది పంటలు..
పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టిన రైతులు ఏ డాదిలో సగటునా ఎనిమిది పంటలు తీయవ చ్చు. మల్బరీ తోటల్లో ఆకు లభ్యత బాగున్న వా రు పది పంటలు కూడా తీస్తున్నారు. పట్టు పు రు గు జీవితచక్రంలో గుడ్డు దశ నుంచి గూడు అల్లే వరకు ఐదు దశలు ఉంటాయి. మొత్తం నెల రో జుల్లో పట్టుగూళ్లు చేతికి వస్తాయి. ప్రస్తుతం చాకీ కేంద్రాల ద్వారా రెండో దశలో ఉన్న పట్టు పురుగులను రైతులకు అందిస్తున్నారు. ఇవి తొమ్మిది రోజుల వయస్సు ఉండి, రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి. రైతులు వీటిని షెడ్లలో వేసి, నాణ్యమైన మల్బరీ ఆకును ఆహారంగా అందిస్తా రు. 21రోజుల్లో మిగిలిన మూడు దశల్లో పురుగులు పట్టుగూళ్లను అల్లుతాయి. 100 గుడ్లకు 80నుంచి 100 కిలోల పట్టుగూళ్లు ఉత్పత్తి అవుతాయి. ఒక పంట తీసిన త ర్వాత మరో బ్యాచ్ కోసం తిరిగి షెడ్డును పూర్తిగా డిస్ఇన్ఫెక్టెడ్ చేస్తారు. 100గుడ్లను పెంచడానికి రెండెకరాల్లో మల్బరీ తోటను పెంచాల్సి ఉంటుంది. 100 గుడ్లకు 80 నుంచి 100 కిలోల వరకు పట్టుగూళ్లు ఉత్పత్తి అవుతా యి. సగటున 80కిలోల వరకు దిగుబడి వస్తుం ది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం పట్టుగూళ్ల ధర కిలోకు రూ.500 వరకు ఉంది. సగటునా కిలోకు రూ.450చొప్పున విక్రయించినా 80కిలోలకు రూ.36వేల ఆదాయం వస్తుంది. ఇలా ఏడాదిలో 8సార్లు పట్టుగూళ్లను ఉత్ప త్తి చేయవచ్చు.
శాస్త్రీయ పద్ధతులు
పట్టు పురుగుల పెంపకంలో శాస్త్రీయ విధానా లే నాణ్యమైన పట్టుగూళ్ల ఉత్పత్తికి దో హదం చేస్తా యి. వీటి షెడ్డు నిర్మాణం కీలకమైంది. ‘సిల్క్ సమగ్ర-2’ ద్వారా నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా గాలి, వెలుతురు తగిన విధంగా ఉండేలా 50 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు, 15 అడుగుల ఎత్తు కొలతలతో షెడ్డు నిర్మిస్తారు. ఈ షెడ్డు విస్తీర్ణం వెయ్యి చదరపు అడుగులు ఉంటుంది. ఒక పంట తీసిన వెంటనే మరో పంటకు సిద్ధం చేయడానికి డిస్ఇన్ఫెక్టడ్ చేస్తారు. రైతులకు అధికారులే అవరసరమైన మందులు అందిస్తారు. డ్రిప్ సౌకర్యం కూడా ఉన్నది. రెయిన్ గన్ల వినియోగంతో మ ల్బరీ ఆకు నాణ్యత పెరిగి మన్నికైన పట్టుగూళ్లు ఉత్పత్తి చేస్తున్నారు.
ప్రోత్సాహకాలు.. రాయితీలు
పట్టు పురుగులు పెంచుతున్న రైతులకు ప్రో త్సాహకాలతో పాటు రాయితీ ఇస్తు న్నారు. పట్టు గూళ్లు ఉత్పత్తి చేసి అమ్మిన ప్రతి రైతుకు కిలోకు రూ.75 పోత్సాహకం ఇస్తున్నది. షెడ్డు నిర్మాణానికి ఎస్సీ, ఎస్టీలకు రూ. 2.92 లక్షలు, జనరల్కు రూ.2.25లక్షలు, డిస్ఇన్ఫెక్టెడ్ మందుల కోసం ఎ స్సీ, ఎస్టీలకు రూ.1750, జనరల్ కు రూ. 2 500 అందిస్తున్నారు. మల్బరీ తోట నా టిన ఎస్సీఎస్టీ రైతులకు రూ. 50,700, జనరల్ రైతులకు రూ. 30వేలు ఇస్తున్నది. ప్రభుత్వ నర్సరీల్లో ఒక్కో మ ల్బరీ మొక్కను రూ.2చొప్పున రై తులకు ఇస్తున్నా రు. కొత్తగా షెడ్డు నిర్మించిన రైతులకు 10ప్లాస్టిక్ ట్రేలు, 300ప్లాస్టిక్ నేత్రికలు అందిస్తున్నారు.
మల్బరీ తోటను చూపిస్తున్న ఈ రైతు పేరు కనుకుల లక్ష్మారెడ్డి. ఇల్లందకుంట మండలం మర్రివానిపల్లె సొంతూరు. తనకున్న పన్నెండెకరాల్లో రెండెకరాల్లో ఐదేళ్ల క్రితం మల్బరీ సాగు చేసి, పట్టు పురుగులు పెంచుతున్నాడు. ఒక్కో బ్యాచ్లో 300 గుడ్లు పెంచుతున్నాడు. నాణ్యమైన మల్బరీ ఆకుతోనే మంచి పట్టు దిగుబడి సాధి స్తున్నాడు. గతంలో సాగుచేసిన పసుపు, అరటి, పత్తి, వరి, ఇతర పంటలతో పోల్చు కుంటే పట్టు సాగులో ఖర్చు తక్కువ, ఆదాయంఎ క్కువగా ఉందంటున్నారు. అవగాహన లేక మొదటి మూడు బ్యాచ్ల వరకు కొంత ఇబ్బంది పడ్డానని, అధికారుల సూచనలతో అవగాహన పెంచుకోవడంతో ఇప్పుడు ఏ సమస్యా లేదంటున్నాడు. మంచి ఆదాయం వస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం..
ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర పంటలతో పో ల్చితే ప ట్టు సాగు లా భదాయకం.ప్రతి నెలా ఆదాయం వ స్తుం ది. తక్కువ పెట్టుడితో మరో పది మందికి ఉపాధి కల్పించవచ్చు. నీటి వినియో గం అత్యల్పం. ప్రభుత్వం రైతులకు రాయితీ ఇస్తున్నది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే రైతుల నుంచి పట్టుగూళ్లు కొనుగోలు చేస్తు న్నది. పట్టు గుడ్లు ఇచ్చినప్పటి నుంచి మార్కెట్లో విక్రయించేంత దాకా అధికారులు సహరిస్తున్నారు.
– సింహాచలం యతీందర్, ఏడీ సెరికల్చర్