కలెక్టరేట్, నవంబర్ 28: కరీంనగర్ నియోజకవర్గంలోని సబ్బండ వర్గాల మద్దతు బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్కే ఉన్నదని, ముస్లిం సమాజం ఆ పార్టీకి అండగా ఉండి గంగులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంఐఎం నగర అధ్యక్షుడు, తెలంగాణ హజ్ కమిటీ సభ్యుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ కోరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజైన మంగళవారం బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ఎంఐఎం ఆధ్వర్యంలో మహార్యాలీ నిర్వహించారు.
నగరంలోని తెలంగాణ చౌక్లో ర్యాలీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, మంత్రి గంగుల కృషితో నగరం స్మార్ట్ సిటీగా రూపాంతరం చెంది, అభివృద్ధిలో హైదరాబాద్తో పోటీపడుతున్నదని కొనియాడారు. ఏడు దశాబ్దాల్లో కానరాని పురోగతి కేవలం తొమ్మిదేళ్లలో చేసి చూపారన్నారు. అందుకే మంత్రి గంగులకు ఓటేసి సీఎం కేసీఆర్కు బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన అరబిక్ బ్యాండ్ మేళం వాయింపు ఆకట్టుకున్నది.
యువకులు, ఎంఐఎం కార్యకర్తలు బ్యాండు మేళానికి అనుగుణంగా కేరింతలు కొడుతూ, నృత్యాలు చేశారు. కార్యక్రమంలో ఎంఐఎం నగర ప్రధాన కార్యదర్శి బర్కత్ అలీ, జాయింట్ సెక్రటరీలు సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రీ యూసుఫ్, అతిఫ్ అతిన, ఖాజ, ఖమ్రుద్దీన్, ఇబ్రహీం, కార్పొరేటర్లు అఖిల్ ఫిరోజ్, షర్పుద్దీన్, అలీబాబా, అజర్ దబీర్, నాయకులు అబ్బాష్ షమీ తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేషన్, నవంబర్ 28: ఈ ఎన్నికల్లో కరీంనగర్ను అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్కే తమ మద్దతు అని జమాత్ ఇస్లామ్ హింద్ నాయకుడు ఖైరోద్దీన్ తెలిపారు. మంగళవారం స్థానిక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్కు పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తున్నామని తెలిపారు. హైదరాబాద్లోని తమ సంస్థ అన్ని వర్గాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. కరీంనగర్లో గంగుల కమలాకర్కు ఓటు వేయాలని సూచించారు.