ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేయడంపై ధర్మపురి మండలంలోని జైన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సంబురాలు చేసుకున్నారు.
జైన సహకార సంఘ కార్యాలయం ముందు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ఈశ్వర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి ఈశ్వర్కు కృతజ్ఞతలు తెలిపారు.