తెలంగాణ ప్రభుత్వం సర్కారు వైద్యాన్ని మరింత చేరువ చేస్తున్నది. నియోజకవర్గకేంద్రాలు, మండలకేంద్రాల్లో అధునాతన దవాఖానలు నిర్మిస్తున్నది. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్ విజ్ఞప్తి మేరకు మానకొండూర్, ఇల్లంతకుంట, చొప్పదండి వైద్యశాలలను అప్గ్రేడ్ చేసింది. దాంతోపాటే నిధులు మంజూరు చేస్తూ ఉత్వర్వులు ఇవ్వడంతో నియోజకవర్గ ప్రజల్లో హర్షం వ్యక్తమైంది.
చొప్పదండి, ఆగస్టు 10 : చొప్పదండి నియోజకవర్గంలో 30 పడకల దవాఖాన ఉంది. సమైక్య రాష్ట్రంలో అరకొర వసతులతో ఉండేది. దీంతో రోగులు ప్రైవేట్ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉండేది. ఈ క్రమంలో స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక వసతులు కల్పించింది. వైద్యు లను నియమించడంతోపాటు మందులను అందుబాటులో ఉంచింది. దీంతో మండలంలోని ప్రజలే కాకుండా చుట్టుపక్కల మండలాల నుంచి రోగుల తాకిడి పెరుగుతున్నది. ప్రస్తుతం రోజుకు 200 నుంచి 300 మంది వస్తుండగా, అంతమందికి ఏర్పాట్లు లేక రోగులు ఇబ్బందిపడుతున్నారు. సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇ టీవల అసెంబ్లీ సమావేశాల్లో చొప్పదండిలో 100 పడకల దవాఖానను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు ప్రభుత్వం స్పందించింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సూచనలతో 100 పడకల దవాఖాన కోసం 37.50 కో ట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎమ్మెల్యే హర్షం వ్య క్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు.
నియోజకవర్గ ప్రజల హర్షాతిరేకాలు
చొప్పదండి పీహెచ్సీని అప్గ్రేడ్ చేస్తూ నిధులు మంజూరు చేయడంపై నియోజకవర్గ ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు సంబురపడుతున్నారు. చొప్పదండి బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు లోక రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌరస్తా వద్ద సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే సుంకెరవిశంకర్ చిత్రపటాలతో కూడిన ఫ్లెక్సీకి ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి- సాంబయ్య, కౌన్సిలర్ మాడూరి శ్రీనివాస్, మారెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, నాయకులు నలుమాచు రామకృష్ణ, దండే కృష్ణ, మహేశుని మల్లేశం, మావూరం మహేశ్, నరేష్ రావణ్ ,పెద్దెల్లి అనిల్, కొత్తూరి నరేష్, తోడేటి డేవిడ్, కుమార్, చెట్టిపల్లి పద్మ, రమేశ్, చోటు, మధు, భూమయ్య, కలిసి పాలాభిషేకం చేశారు.
మానకొండూర్లోనూ సంబురాలు
మానకొండూర్, ఆగస్టు 10: ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తర సమయంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మానకొండూర్, ఇల్లంతకుంట పీహెచ్సీలను అప్గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 50 పడకల దవాఖానలుగా అప్గ్రేడ్ చేయడంతోపాటు 17.50 కోట్ల చొప్పున రెండు వైద్యశాలలకు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నియోజకవర్గప్రజలు హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు, జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్గౌడ్ ఆధ్వర్యంలో మానకొండూర్లోని కరీంనగర్- వరంగల్ రహదారిపై సంబురాలు చేసుకున్నారు.ఆర్బీఎస్ మండల కన్వీనర్ రామంచ గోపాల్రెడ్డి, బీఆర్ఎస్వై మండలాధ్యక్షుడు ఆడప శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి ఎరుకల శ్రీనివాస్గౌడ్, నాయకులు ముద్దసాని శ్రీనివాస్రెడ్డి, పిట్టల మధు, ఉండింటి శ్యాంసన్, పారునంది కిషన్, ఇస్కుల్ల అంజనేయులు, ఆరెపల్లి కిరణ్, ఏల్పుగొండ మొగిలి, పాషా, వెంకటస్వామి, పిండి సందీప్, గంజి శ్రీనివాస్, ఉండింటి శివకుమార్ కలిసి పటాకులు కాల్చారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సారథ్యంలో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, పీహెచ్సీ అప్గ్రేడ్ కావడంతో మండల ప్రజలకు మరింత మెరుగైన సేవలందుతాయని దీమావ్యక్తం చేశారు.