జగిత్యాల రూరల్, సెప్టెంబర్ 11: రాష్ట్రంలో గీత కా ర్మికులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. పొరండ్ల గ్రామంలో సోమవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రేణుకా ఎల్లమ్మ దేవీ ఆలయంలో కలశ పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలో నాలుగు కోట్ల ఈత, తాటి మొక్కలు నాటామని, నియోజక వర్గంలో 4 లక్షల ఈత, తాటి మొక్కలు నాటామని పేర్కొన్నారు. గౌడ సంఘ భవనాలు, ఎల్లమ్మ ఆలయాలకు నిధులు మంజూరు చేశామన్నారు.
ఎక్సైజ్ సర్కిల్ను ధర్మపురి నుంచి జగిత్యాలకు మార్చామన్నారు. గీత కార్మికుల కు 51 ఏండ్లకే రూ.2వేలు పింఛన్ అందిస్తున్నదని, దేశంలో ఈ పథకం ఎక్కడా లేదన్నారు. మరణించిన గౌడకులస్తులకు, ప్రమాదంలో గాయపడ్డ వారికి ఇటీవల ప్రభుత్వం రూ.12.5 కోట్లు విడుదల చేసిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్రప్రసాద్, పార్టీ మండలా ధ్యక్షుడు బాల ముకుందం, ఎంపీటీసీ సౌజన్య-తిరుపతి, నాయకులు ఆరె రవి, హరీశ్, కరుణాకర్ రెడ్డి, తోడేటి శేఖర్ గౌడ్, రవి తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
ధరూర్ గ్రామ బీఆర్ఎస్ నాయకుడు సత్యనారాయణ రావు మామ మోరపల్లి గ్రామానికి చెందిన మేన్నేని రాజేశ్వర్ రావు అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. వారి కుటుంబాన్ని సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరామర్శించారు. రాజేశ్వర్ రావు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దామోదర్ రావు, రైతు బంధు సమితి జిల్లా మెంబర్ కట్ట రాజేందర్, నాయకులు కమలాకర్ రావు, రాజేందర్ రావు, అజిత్ రావు తదితరులు పాల్గొన్నారు.