కార్పొరేషన్, జూన్ 6: తెలంగాణ దశాబ్ది కాలంలోనే అన్ని రంగాల్లో ఎంతో ప్రగతిని సాధించిదని నగర మేయర్ యాదగిరి సునీల్రావు అన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. రేకుర్తిలో రూ.10 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం భూ మిపూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మా ట్లాడుతూ కరీంనగర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఊరురా చెరువుల పండగను రేకుర్తిలోని పెంటకమ్మ చెరువు వద్ద ఘనంగా నిర్వహిస్తామన్నారు. అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పెంటకమ్మ చెరువు వద్ద బతుకమ్మ ఎత్తుకున్న మహిళ విగ్రహానికి రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దాలని సూ చించారు.
సాంస్కృతిక కార్యక్రమాలకు స్టేజ్ , లైటింగ్, సీటింగ్ ఏర్పాట్లు చేయాలని, వచ్చే వా రికి భోజన వసతి కల్పించాలని సూచించారు. ఉ మ్మడి పాలనలో చెరువులు అడుగంటి పోయిన ప రిస్థితులు ఉండేవని, కానీ ఇప్పుడు వేసవి కాలం లో మత్తడి దూకే పరిస్థితికి సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ని ర్మించి చెరువులకు జలకళను తెచ్చారని తెలిపారు. సేద్యానికి ఉచిత కరెంట్, సాగునీరు అందించి న ఘనత ఈ సర్కారుకే దక్కిందన్నారు. గతంలో రైతులు పంటలు వేసి వర్షాల కోసం ఆకాశం వైపు చూసే పరిస్థితి ఉండేదన్నారు. కానీ ఇప్పుడు ఆ ప రిస్థితి లేదన్నారు. కమిషనర్ సే వా ఇస్లావాత్, కార్పొరేటర్లు సుధగోని మాధవీ కృష్ణగౌడ్, ఎదుర్ల రాజశేఖర్, నగరపాలక అధికారులు ఉన్నారు.
వానకాలంలో అప్రమత్తంగా ఉండాలి..
వానకాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండి వరద నీటితో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకో వా లని మేయర్ సునీల్రావు నిర్దేశించారు. అన్ని మురుగుకాల్వల్లో సిల్ట్ తొలగింపు పనులను చేపడుతున్నామని పేర్కొన్నారు. మంగళవారం రూ. 67.79 లక్షలతో చేపడుతున్న సీల్ట్ తొలగింపు ప నులకు ఆదర్శనగర్లో భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సిల్ట్ తొలగిం పు పనుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టెండర్ల నిబంధనల మేరకు పనులు పూర్తి చేయాలన్నారు.
ప్రధాన మురుగుకాల్వల్లో 18 చోట్ల సిల్ట్ తొలగింపు పనులను మొదలుపెట్టామన్నా రు. పది రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించా రు. అంతర్గత ఓపెన్ డ్రైనేజీల్లో కూడా సిల్ట్ తొలగింపు పనులు చేపడుతన్నామని తెలిపారు. ఈ పనులను ఇంజినీరింగ్ అధికారులు పర్యవే క్షించా లన్నారు. నాణ్యతలోపం లేకుండా డ్రైనేజీ సిల్ట్ తొలగించిన చోట ముందస్తు, తర్వాత ఫోటోలు (బీఫోర్ ఆప్టర్ ఫొటోలు) సేకరించడంతో పాటు స్థానికంగా ఉన్న ఇంటినంబర్ రికార్డు చేసి యజమాని సంతకం తీసుకొవాలన్న నిబంధన పెట్టామన్నారు. గతంలో ప్రజలకు ఎకడెకడైతే వరదలతో ఇబ్బందులు వచ్చాయో ఆయా ప్రాంతా ల్లో మరోసారి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. వానకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా 24 గంటలు అధికార సిబ్బందితో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి డిజాస్టర్ రెస్పా న్స్ ఫోర్స్ బృందం పని చేస్తుందన్నారు.