Chandurthi | చందుర్తి, జూన్ 29 : రైతుల అభివృద్ధే సహకార సంఘాల లక్ష్యమని చందుర్తి ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు. సహకార సంఘం కార్యాలయంలో 73వ అఖిల భారత సహకార వారోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార సంఘం జెండాను ఆవిష్కరించి గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతుల అభివృద్దే సహకార సంఘాల లక్ష్యమని, సహకార వ్యవస్థ బలపడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందన్నారు.
సంఘం ద్వారా రైతులకు అర్హతను బట్టి రుణాలు, ఎరువులు, విత్తనాలు, ధాన్యం కొనుగోలు సేవలు పారదర్శకంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ శ్రీ వర్ధన్, వైస్ చైర్మన్ పుల్కం మోహన్, డైరెక్టర్లు రవి, లచ్చయ్య, మణెమ్మ, రమేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.