కోరుట్ల, జూలై 31 : ఆధునికహంగులు.. మెరుగైన వసతులతో కోరుట్ల పట్టణంలోని సాయిరామ నదీతీరాన వైకుంఠధామం అత్యద్భుతంగా నిర్మితమైంది. 1.90 కోట్ల పట్టణ ప్రగతి నిధులతో నిర్మించిన ఈ శ్మశాన వాటికలో ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తున్నది. తెలంగాణ సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న వైకుంఠధామాల్లో ఇది మేటిగా నిలువనున్నది.
మూడు బర్నింగ్ ప్లాట్ ఫామ్స్, సిట్టింగ్ గ్యాలరీ, ఉడ్ స్టోరేజీ హల్, కర్మకాండల గది, ఆఫీస్ రూమ్, అస్థికలు, బూడిద నిల్వ చేయు గది, మహిళలు, పురుషులకు వేర్వేరుగా మూత్ర శాలల గదులు, గజిబో గార్డెనింగ్, స్టోన్ శివ స్టాచ్యూ ఉన్నాయి. వారం రోజుల్లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.