హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ప్రైవేట్ దవాఖానలపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తున్నది. నిబంధనలు బేఖాతరు చేస్తున్న దవాఖానలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నది. అయినా స్పందించకుంటే చర్యలకు ఉపక్రమిస్తున్నది. తాజాగా ఇవాళ కరీంనగర్ జిల్లాలో 6 ప్రైవేట్ దవాఖానల లైసెన్స్లను ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. ఇటీవల షోకాజ్ నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో 15 రోజులపాటు లైసెన్స్లను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చింది. కరీంనగర్లోని పుల్లెల, మురుగన్, కృష్ణ లేపాక్షి, జమ్మికుంటలోని మమత, శ్రీవిజయసాయి, సురక్ష దవాఖానల అనుమతులు తాత్కాలికంగా రద్దయ్యాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.