హుజూరాబాద్, ఏప్రిల్ 17: ‘బీజేపీ ఎమ్మె ల్యే ఈటల హుజూరాబాద్ ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తవ్. ఇప్పటికే ఎందరో మహిళల పుస్తెలు తెంచినవ్. నీ దుర్మార్గాలకు ఇంకెందరినీ బలి తీసుకుంటవ్’ అంటూ మండలి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఆయన మంచి యాక్టర్. నటనలో కమలాసన్ను మించిపోయిండు. మాయమాటలు చెబుతూ హుజూరాబాద్ ప్రజలను దగా చేస్తున్నడు’ అని మండిపడ్డారు. ఇప్పటికే ఎందరో మహిళల పుస్తెలు తెంపిండని ఆరోపించారు. పదవులు ఇచ్చి అందలమెక్కించిన సీఎం కేసీఆర్పై కుసంస్కారంతో మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనమని దుయ్యబట్టారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్తో కలిసి హుజూరాబాద్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈటల.. హుజూరాబాద్లో దేనికోసం ధర్నా చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. చెల్పూర్లో జరిగిన సంఘటన ఏంటీ? ధర్నాలో ఈటల మాట్లాడిన మాటలు ఏంటి? ప్రజలు గమనించాలన్నారు. రాజేందర్ సీఎం కేసీఆర్పై అసభ్య పదజాలంతో మాట్లాడడం బాధాకరమన్నారు. చావు బతుకుల్లో ఉన్న మహిళను పరామర్శించకుండా నిందితుడికి వత్తాసు పలకడం ఏంటనీ నిలదీశారు. మహిళలు అంటే చిన్న చూపా..? అని ప్రశ్నించారు.
ఈటలను ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు. నాడు ఉద్యమకారులను హింసించిన చరిత్ర ఆయన సొంతమన్నారు. పెద్దపాపయ్యపల్లికి చెందిన ప్రవీణ్ యాదవ్ను, వీణవంక మండలం నర్సింగాపూర్లో బాలరాజును బలిగొన్నది, తిప్పారపు సంపత్, కరాటే సమ్మయ్యను కొట్టించింది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. ఈటల మతి భ్రమించి సైకోలాగా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. జై శ్రీరామ్ అంటూ రాముడి భూములు, జై భీమ్ అంటూ దళితుల భూములు గుంజుకున్నాడని ఆరోపించారు. హుజూరాబాద్లో దళితబంధు రాలేదంటున్న ఈటల.. దళితబంధు వాహనాలను ఎందుకు ప్రారంభిచావన్నారు. నియోజకవర్గంలోనే 18,021 మందికి దళిత బంధు ఇచ్చామని చెప్పారు. ఈటలకు దమ్ముంటే దళితబంధుపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు అంటేనే ఈటల రాజేందర్కు కోపం అని, బీజేపీ సర్పం చ్ ఉన్న గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదురొంటున్నారని పేరొన్నారు.
చెల్పూరులో 14 ఏండ్లుగా నడుస్తున్న మటన్ షాప్ను ఆ గ్రామ సర్పంచ్ ఎందుకు కూలగొట్టాలని చూస్తున్నాడని, రంగాపూర్లో 10 ఏండ్లుగా నివసిస్తున్న వైశ్యుడి ఇంటిని అక్రమంగా కూల కొట్టించాడని ఆరోపించారు. కేసీఆర్, బీఆర్ఎస్ లేకుంటే ఈటలకు ఇంత పేరు వచ్చేదా.. ఎక్కడో గుడ్లు ఏరుకునే నీవు రాజకీయాల్లోకి వచ్చేదా? ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఏడాదిన్నర గడుస్తున్నా ప్రజలకు చేసిందేంటో.. కేంద్రం నుంచి తెచ్చిన నిధుల వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంబాలలో బీజేపీకి చెందిన సంపత్ క్యాన్సర్తో బాధపడితే ఈటల ముఖం చాటేశాడని, కానీ సర్కారు 3లక్షల సీఎంఆర్ఎఫ్ ఇచ్చి ఆదుకున్నదని పేర్కొన్నారు.
అలాగే కుమార్ స్వామి అనే బీజేపీ కార్యకర్తకు 5 లక్షల రైతుబీమా ఇచ్చామని తెలిపారు. నియోజకవర్గంలో స్వయంగా ఇంటింటికీ తిరిగి 1200 మంది లబ్ధిదారులకు చెకులు పంపిణీ చేశానని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేసేందుకు అనేక మంది బీజేపీకార్యకర్తలు బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇల్లందకుంట రాములోరికి పట్టు వస్త్రాలు ప్రభుత్వం అందిస్తుందని, మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. ప్రకాశ్ అంబేదర్ను హుజురాబాద్ కు ఎందు కు తీసుకువచ్చారని అడుగుతున్న ఈటల.. ఆయన వస్తే నీకు వచ్చిన ఇబ్బందేంటో చెప్పాలని నిలదీశారు. ఈ ప్రాంత ప్రజలు ఈటలకు ఓటేసిది ఎందుకు అని.. అభివృద్ధి కోసమా లేక ఈటల రాజేందర్ను టీవీలలో చూసేందుకా అని ఎద్దేవా చేశారు.