పెద్దపల్లి టౌన్, జూన్ 12: తెలంగాణలో అద్భుతమైన పాలన కొనసాగుతున్నదని, దేశంలో ఎక్కడాలేని విధంగా శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు రక్షణతో కూడిన ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తూ తెలంగాణ పోలీస్ వ్యవస్థను అగ్రగామిగా నిలబెట్టిన ఘనత సీఏం కేసీఆర్కు మాత్రమే సాధ్యమైందని కొనియాడారు. దే శంలో ఎక్కడా లేనన్ని పథకాలు తెలంగాణ అమలవుతున్నాయని పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం పెద్దపల్లి పోలీస్ శాఖ నేతృత్వంలో ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో తెలంగాణ 2కే రన్ను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించా రు. అట్టహాసంగా ప్రారంభమైన ఈ రన్లో వందలాది మంది యువత పాల్గొన్నారు. ఈ సందర్భం గా యువతను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి రోజూ యువత శారీరక దృఢత్వం కోసం, ఫిట్నెస్ కోసం, మంచి ఆరోగ్యం కోసం నిత్యం వ్యాయామం చేయాలన్నారు. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే అనుకున్న లక్ష్యాన్ని అధిగమించవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి, సంక్షేమ పథకాల అమలు, తెలంగాణ సాధించిన ప్రగతి గురించి నిత్యం ప్రజలకు వివరించాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. పొరాడి సాధించుకున్న తెలంగాణలో దేశంలో ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందుతున్నాయంటే ఆ ఘనత కేవ లం సీఏం కేసీఆర్కు మాత్రమే దక్కుతుందన్నా రు.
ప్రత్యేక రాష్ట్ర సాధనలో అనేక అవరోధాలు, అవమానాలు ఎదురైనా దృఢ సంకల్పంతో తెలంగాణ సాధించిన గొప్ప నేత సీఏం కేసీఆర్ అని కొ నియాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలతో మాట్లాడి ఇక్కడి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న కేటీఆర్కు అభినందనలు తెలిపారు. అదనపు కలెక్టర్ వీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ యువత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఫిట్గా ఉండాలని, ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగ నియామకాల్లో ఉద్యోగాలు సాధించాలని కోరారు. యువత భవిష్యత్ కోసం ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 2కే రన్ ర్యాలీ ప్రభుత్వ ఐటీఐ నుంచి బస్టాండ్, అయ్యప్ప ఆలయం, అమర్ నగర్, పెద్దమసీదు, జెండా చౌరస్తా, కమాన్ మీదుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు సాగింది. ర్యాలీ అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్, ఏసీపీ మహేశ్ ర్యాలీలో భోజనాలు వండించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి, ట్రాఫిక్ సీఐ బర్ల అనిల్కుమార్, సీఐ ప్రదీప్కుమార్, ఎస్ఐ మహేందర్, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మత్య్స శాఖ అధికారి భాస్కర్ పాల్గొన్నారు.