మెట్పల్లి రూరల్, జూన్ 5: దేశంలో వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకై క రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కోరుట్ల ఎమ్మె ల్యే, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం మెట్పల్లి మండలం వెల్లుల్ల శివారులోని కేఎన్ రెడ్డి గార్డెన్స్లో ఎమ్మెల్యే అధ్యక్షతన వి ద్యుత్ ప్రగతిపై నిర్వహించిన విజయోత్సవ సమావేశానికి జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, కలెక్టర్ యాస్మిన్ బాషా, ఎస్పీ భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యుత్ ప్రగతిపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ, రాష్ట్రం ఏర్పడక ముందు విద్యుత్ లేక అనేక ఇక్కట్లు పడ్డామని, కరెంటు వచ్చిందంటే అన్నదాతలు తినే అన్నం విడిచిపెట్టి పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లేవారని గుర్తుచేశారు.
తెలంగాణ వస్తే లాంతర్లు పట్టుకొని తిరిగాల్సి వస్తుందన్న ఆంధ్రా నాయకులే ఆశ్చర్యపోయేలా నేడు తెలంగాణ ఏర్పడిన ఏడాదిలోపే సీఎం కేసీఆర్ దూరదృష్టితో విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. రైతులు బాగుపడితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న సంకల్పంతోనే సీఎం కేసీఆర్ వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్, నీళ్లను సరఫరా చేస్తున్నారని చెప్పారు. నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా వల్లే నేడు హైదరాబాద్కు భారీగా పరిశ్రమలు తరలివస్తున్నాయని, దీం తో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తున్నదన్నారు.
ప్రతి రెండు గ్రామాలకు ఒక విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటు చేసుకున్నామని, దీంతో నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతున్నదని పేర్కొన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో రూ. 205 కోట్లతో విద్యుత్ అభివృద్ధి పనులు చేసినట్లు వెల్లడించారు. నాడు 220 కేవీ సబ్స్టేషన్ ఒకటి ఉండ గా, అదనంగా మరొకటి ఏర్పాటు చేసుకున్నామన్నారు. 33/11 కేవీ సబ్స్టేషన్లు నాడు 20 ఉంటే నేడు 37 ఉన్నాయని, 33 కేవీ లైన్లు, 11కేవీ లై న్లు, ఎల్టీ లైన్లను దాదాపు రెండింతలు అభివృద్ధి చే సినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వినోద్కుమార్, డీఎస్పీ రవీందర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్లు సుజాత, లావణ్య, ఆర్బీఎస్ జిల్లా కో -ఆర్డినేటర్ వెంకట్రావు, ట్రాన్స్కో డీఈ గం గా రాం, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, విద్యుత్ అ ధికారులు, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్లు, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు.
చీకటి రాష్ట్రంలో వెలుగు నింపిన కేసీఆర్
విద్యుత్ కోతలతో అంధకారంగా ఉన్న తెలంగాణలో సీఎం కేసీఆర్ వెలుగు నింపారు. హాయిగా నిద్రపోతున్నామంటే ఆ ఘనత కేసీఆర్దే. తెలంగాణలో 7,780 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగితే నేడు 18,568 మెగావాట్లకు చేరింది. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. ఏ నాయకుడికైనా భవిష్యత్ తరాలు బాగుపడాలన్న విజన్ ఉండాలి. అది కేవలం కేసీఆర్కు మాత్రమే ఉంది. వ్యవసాయ మోటార్లకు మోడీ మీటర్లు పెడతామంటే కేసీఆర్ ఒప్పుకోలేదు. పక్క రాష్ట్రంలో ఇప్పటికే మీటర్లు బిగించారు.
– దావ వసంత, జగిత్యాల జడ్పీ చైర్పర్సన్
అవసరమున్నంత వరకే వినియోగించుకోవాలి
గతంలో ఏ సమావేశం నిర్వహించినా విద్యుత్ శాఖపైనే ఫిర్యాదులు వచ్చేవి. నేడు ఆ పరిస్థితి లేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ప్రధానంగా వ్యవసాయం, విద్యుత్ శాఖలపై దృష్టి కేంద్రీకరించి పురోగతిని సాధించారు. తెలంగాణ వస్తే చీకటి అవుతుందని, తీగలపై బట్టలు ఆరబెట్టుకోవాలన్న వారే ఈరోజు ఆశ్చర్యపోయేలా రాష్ట్రంలో విద్యుత్ సరఫరా జరుగుతున్నది. జిల్లాలో 220/30 కేవీ సబ్స్టేషన్ ఒకటి, 220/11కేవీ రెండు, 132/33 కేవీ నిమిది, 33/11 కేవీ సబ్స్టేషన్లు 116 తెలంగాణ వచ్చాక ఏర్పాటు చేసుకున్నాం. విద్యుత్ సహజ వనరు. దీన్ని అవసరమున్నంత వరకే వాడుకోవాలి. ఉచిత విద్యుత్తే కదాని రైతులు వృథా చేయద్దు. మోటార్లకు స్టాటర్లు పెట్టుకోవాలి.
– యాస్మిన్ బాషా, జగిత్యాల కలెక్టర్
పొదుపుగా వాడుకోవాలి
ఉచితంగా ఇస్తున్నారని విద్యుత్ను వృథా చేయద్దు. పొదుపుగా వాడుకోవాలి. నిరంతర విద్యుత్ సరఫరాతో ప్రజలు, ప్రధానంగా రైతులు ఆనందంగా ఉన్నారు. నిరంతర విద్యుత్ సరఫరాతో నాకు సాధారణ పౌరుడిగా ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగింది. ధర్నాలు, రాస్తారోకోలు లేవు. దీంతో రెండు విధాలుగా నాకు ఆనందంగా ఉంది.
– ఎగ్గడి భాస్కర్, జగిత్యాల ఎస్పీ