చిగురుమామిడి, జనవరి 4: సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పేర్కొన్నారు. రామంచలో సర్పంచ్ గుంటి మాధవీతిరుపతి ఆధ్వర్యంలో 100 మందికి పైగా వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇందుర్తిలో బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు ఎసే సిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఎంపీపీ కొత్త వినీత-శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ గీకురు రవీందర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్యతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యకర్తలంతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సర్వాయి పాపన్న అని, ఆయన పోరాటం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ పేర్కొన్నారు. గౌడ సంఘం మం డల శాఖ ఆధ్వర్యంలో చిగురు మామిడిలో ఏర్పాటు చేసిన స ర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆయ న ఆవిషరించి, మాట్లాడారు. పాపన్న జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నా రు. సైదాపూర్కు సర్వాయి పాపన్న మండలం అని నామకరణం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, చిగురుమామిడి మం డల ప్రజలు చైతన్యవంతులని పేర్కొన్నారు. పోరాట యోధుడు పాపన్న చరిత్రను తెలంగాణ ప్రభు త్వం గుర్తించడం సంతోషకరమాన్నారు.
పాపన్న జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ఇందు ర్తికి చెం దిన విగ్రహ రూపశిల్పి ఆకుల వెంకన్నను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, ఎంపీపీ కొత్త వినీత-శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ గీకురు రవీందర్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు బుచ్చన్న, మండలాధ్యక్షుడు తాళ్లపల్లి తిరుపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్, జిల్లా నాయకులు కలర్ సత్తన్న, కొత్త శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, జిల్లా నాయకులు పన్యాల శ్యాం సుందర్రెడ్డి, మామిడి అంజ య్య, అందె సుజా త, మంద పవన్, బోయిని అశోక్, సృజన్కుమార్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, సాంబారి కొమురయ్య, కరివేద మహేందర్ రెడ్డి, రామోజు కృష్ణమాచారి, ముంజ ప్రకాశ్, బెజ్జంకి లక్ష్మణ్, ఎంపీడీవో నర్సయ్య, డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.