ప్రతీ పేద బిడ్డ ఉన్నత చదువు కల సాకారం చేసేందుకు రాష్ట్ర సర్కారు సాయమందిస్తున్నది. ఆర్థిక సమస్యతో ఏ ఒక్క విద్యార్థ్థి విదేశీ విద్యకు దూరం కాకూడదని ఉపకార వేతనంతో కొండంత భరోసానిస్తున్నది. గత పాలకుల హయాంలో కేవలం రూ.10 లక్షలు మాత్రమే ఉన్న ఓవర్సీస్ స్కాలర్షిప్ను రూ.20 లక్షలకు పెంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల, ఈబీసీ విద్యార్థులకూ వర్తింపజేస్తున్నది. ఫలితంగా ప్రతి సంవత్సరం ఎంతో మంది విదేశాల్లో ఉన్నత చదువులు పూర్తి చేసి అక్కడే కొలువుల్లో చేరి తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా, ఈ నెల 30 వరకు స్వీకరించనున్నారు.
పెద్దపల్లి, సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ) : ప్రతి ఒక్క పేద బిడ్డకు చదువు అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో గొప్ప పథకానికి అంకురార్పణ చేశారు సీఎం కేసీఆర్. బడుగు వర్గాలకు అంబేద్కర్ పేరిట, బలహీనవర్గాల వారికి జ్యోతిబా ఫూలే పేరిట, మైనార్టీలకు కేసీఆర్ పేరిట ఓవర్సీస్ విద్యా పథకాన్ని మొదలు పెట్టారు. స్థానికంగా విద్యారంగంలో అత్యున్నత ప్రతిభ చూపి, సాంకేతికంగా అభివృద్ధిని సాధించి విదేశాల్లో విద్యాభ్యాసం చేసేందుకు ఉత్సాహం చూపే విద్యార్థులకు ఊతంగా నిలిచేందుకు ఈ పథకాలను మొదలుబెట్టారు. విదేశాల్లోని పేరెన్నికగన్న సాంకేతిక నైపుణ్య కోర్సుల్లో, వైద్య కోర్సుల్లో చేరేందుకు సిద్దపడే విద్యార్థులకు రూ.20లక్షలకు పైగా ఉపకార వేతనాలు అందించడంతో పాటు, వారికి విమాన టికెట్, ఇతర సదుపాయాలకు కొంత నగదును అందించే మహత్తర పథకం ఇది. ఇప్పటి వరకు అనేక మంది విద్యార్థులు విదేశాల్లోని గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. కొందరు పూర్తి చేసి ప్రఖ్యాతిగాంచిన కంపెనీల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తున్నారు.
చదువులూ.. కొలువులు అక్కడే..
అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూ ర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా దేశాల్లో మాస్టర్స్, పీజీ, పీహెచ్డీ కోర్సు లు చదివే వారికి ఒకో విద్యార్థికి రూ.20 లక్షల వరకు సాయం అందించి ప్రోత్సహిస్తున్నది. ఈ పథకాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి దాకా కొన్ని వేల మంది విద్యార్థులు లబ్ధి పొందారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్యను పూర్తి చేసుకొని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నారు. విదేశాల్లో మంచి కొలువులు పొంది బంగారు భవితకు బా టలు వే సుకుంటున్నారు. ఇప్పటికే అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ టెక్బాల్, మిచిగాన్ టెక్నాలజీ, మిన్నీసోటా యూనివర్సిటీలు, కెనడాలోని కా ంకోర్టియా, లేక్ హెడ్, వాటర్ల్ యూనివర్సిటీలు, యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ హంచేరియా, వెస్ ఆల్ ఇంగ్లాండ్ బ్రిస్టల్ ఫ్రెంచ్ క్యాం పస్, ఆస్ట్రేలియాలోని మెల్బో ర్న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్విన్బోర్న్ యూనివర్సిటీ ఆఫ్ టె క్నాలజీ, జర్మనీలోని ప్లేన్బర్న్, బట్టోవాన్ గురి కీ, తదితర యూనివర్సిటీల్లో ప్రవేశం పొందారు.
నాడు రూ.10 లక్షలు, ఇప్పుడు రూ.20 లక్షలు
ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే విదేశీ విద్యానిధి పథకం ఉండేది. అందులో ఒకో విద్యార్థికి కేవలం రూ.10 లక్షల ఆర్థిక సాయం మాత్రమే అందేది. తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలతోపాటు బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు సైతం పథకాన్ని వర్తింపజేసింది. అంతేకాకుండా ఒకో విద్యార్థికి ఆర్థిక సా యాన్ని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది. లబ్ధిదారుల కుటుంబ ఆదాయాన్ని సై తం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. గతంలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ దేశాల్లోనే చదువుకొనే అవకాశం ఉం డగా.. ఇప్పుడు జర్మనీ, న్యూజీలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియాలోనూ చదివే అవకాశం కల్పించింది.
ఇవీ అర్హతలు..
దరఖాస్తు ఇలా..
విద్యార్థులు ఆనె్లైన్లో http:// www. telanganaepass.cgg.gov.in అనే వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతానికి బీసీ విద్యార్థులు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీసేవా నుంచి జారీ చేసిన కుల, ఆ దాయ, జనన ధ్రువీకరణ పత్రాలు జత చే యాలి. ఆధార్ కార్డు, నివాస ధ్రువీకరణ, పాస్పోర్ట్ సైజ్ కాపీ, ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ మెమోలు సమర్పించాలి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఇంటర్వ్యూలో పాల్గొనాలి. ఇందులో ఎంపికైన విద్యార్థులకు రూ.20 లక్షల సాయం అందుతుంది. మొదటి సంవత్సరం రూ.10 లక్షలు, రెండో సంవత్సరం మరో రూ.10 లక్షలు అందిస్తారు.