తెలంగాణచౌక్, మార్చి 10: సావిత్రీబాయి ఫూలే జీవితం అందరికీ ఆదర్శం అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అజయ్ పటేల్ తెలిపారు. స్థానిక రిషి కాన్వెంట్ స్కూల్లో శుక్రవారం ఫూలే వర్ధంతి నిర్వహించారు. ఫూలే చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అజయ్పటేల్ మాట్లాడుతూ, ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని మహిళలకు విద్యను నేర్పించిన మహనీయురాలు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి వేణు, ఉపాధ్యక్షుడు అశ్విన్, రాష్ట్ర కార్యదర్శి చంద్రమౌళి, విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. నగరంలోని సీపీఐ కార్యాలయం (బద్ధం ఎల్లారెడ్డి) భవనంలో ఫూలే చిత్రపటానికి జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు కిన్నెర మల్లవ్వ, ప్రధాన కార్యదర్శి పద్మ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఫూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో అంజలి, రాణి పాల్గొన్నారు. అలాగే, నగరంలోని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఫూలే చిత్రపటానికి సంఘం నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నగరంలోని పద్మావతి కల్యాణ మండపంలో ఫూలే చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వరాల జ్యోతి, ప్రధాన కార్యదర్శులు దొగ్గలి శ్రీధర్, రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం మహిళా కార్యదర్శి అరుణ, అధికార ప్రతినిధి స్వరూపారాణి, ఉపాధ్యక్షురాలు దేవరకొండ సంతోషిణి, కార్యదర్శి ఆదర్శ్ పాల్గొన్నారు.
చొప్పదండి, మార్చి 10: పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పెద్దెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫూలే వర్ధంతి నిర్వహించారు. ఫూలే చిత్రపటానికి అంబేద్కర్ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి, అంబేద్కర్ సంఘం నాయకులు రాజలింగం, లచ్చయ్య, పెద్దెల్లి శేఖర్, భూమయ్య, బాపురావు, డేవిడ్, శ్రీనివాస్, కుమార్, వీరేశం, అరవింద్, సంజీవ్, నాగరాజు, హరీశ్, చింటు, సంపత్, రోహిత్, వినిల్ తదితరులు పాల్గొన్నారు.