రామడుగు, జనవరి 10 : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని, ఇందులో సీఎం కేసీఆర్ పాత్ర ఎంతో గొప్పదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కొనియాడారు. సోమవారం రామడుగు రైతువేదికలో మండల వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతుబంధు సంబురాల్లో స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. రంగురంగుల పూలు, మామిడి తోరణాలతో అలంకరించిన ఎడ్ల బండిలో ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి రైతువేదిక నుంచి పోచమ్మవాడ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతువేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం అన్నదాత కుటుంబాల్లో ఆనందం నింపిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు పథకం రూ.50వేల కోట్ల మైలురాయిని దాటడం ఆనందంగా ఉందన్నారు. సీమాంధ్ర పాలనలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంతాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. వ్యవసాయాభివృద్ధి కోసం రాష్ట్రంలోని ప్రతి ఊరిలో చెరువులు, కుంటలను మిషన్ కాకతీయ పథకం ద్వారా పునరుద్ధరించారని గుర్తు చేశారు.
గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఆ జలాలను కరువునేలకు తెచ్చి బంగారు తెలంగాణకు బాటలు వేశారని కొనియాడారు. పెట్టుబడి సాయంగా ఎకరాకు ఏటా రూ.10వేల రైతుబంధు, రైతు మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.5లక్షల రైతుబీమా అందించే రాష్ట్రం మనదేనన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి కోఆర్డినేటర్ జూపాక కరుణాకర్, ఏఎంసీ చైర్మన్ గంట్ల వెంకట్రెడ్డి, కొక్కెరకుంట సింగిల్విండో చైర్మన్ వొంటెల మురళీకృష్ణారెడ్డి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు గర్రెపెల్లి కరుణాకర్, ఏడీఏ రామారావు, ఏవో యాస్మిన్, వైస్ ఎంపీపీ పూరెల్ల రాజ్గోపాల్, ఎంపీటీసీల ఫోరం మంలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్రెడ్డి, మాజీ ఎంపీపీలు మార్కొండ కిష్టారెడ్డి, తౌటు మురళి, మామిడి తిరుపతి, సర్పంచులు పంజాల ప్రమీల, జవ్వాజి శేఖర్, ఎంపీటీసీ వంచ మహేందర్రెడ్డి, ఏఈవోలు సంపత్, రాజేశ్, సంపత్, గోవర్ధన్, ఆత్మ ఏటీఎం స్రవంతి, బీటీఎం స్వప్న, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్రెడ్డి, నాయకులు కలిగేటి లక్ష్మణ్, వొంటెల వెంకటరమణారెడ్డి, పెంటి శంకర్, కొలిపాక మల్లేశం, ముదుగంటి రాజిరెడ్డి, తడగొండ నర్సింగ్బాబు, ఎడవెల్లి పాపిరెడ్డి, పంజాల జగన్మోహన్గౌడ్, వీర్ల రవీందర్రావు, సంజీవరావు, రాజమౌళి, పోశమల్లు, జుట్టు లచ్చయ్య, అంజయ్య, మినుకుల తిరుపతి, సైండ్ల కరుణాకర్, సాతర్ల వివేకానంద, చాడ ప్రభాకర్రెడ్డి, ఆరపెల్లి ప్రశాంత్, మ్యాకల అంజయ్య, చరణ్, మాదం రమేశ్, లంక మల్లేశం, ఎడవెల్లి మల్లేశం, కొత్త సాగర్, కొడిమ్యాల రాజేశం పాల్గొన్నారు.