చొప్పదండి, జనవరి 12: యువతకు స్ఫూర్తి స్వామి వివేకానందుడు అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు దూస రాము ఆధ్వర్యంలో వివేకానందుడి జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వివేకానందుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, యువత కోసం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో స్థాపిస్తున్న పరిశ్రమలతో యువతకు ఉపాధి దొరుకుతుందని తెలిపారు. యువత పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి, సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, సర్పంచ్ వెల్మ నాగిరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చీకట్ల రాజశేఖర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి, వివేకానంద యువజన సంఘం సభ్యులు మంచాల మోహన్, తాటిపెల్లి శివ, తాటిపల్లి ఆంజనేయులు, గుండ్ల శంకర్, సిరిపురం తిరుపతి, దండె శ్రీనివాస్, కౌన్సిలర్లు మాడూరి శ్రీనివాస్, వడ్లూరి గంగరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏనుగు స్వామిరెడ్డి, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్లు గొల్లపల్లి శ్రావణ్, గన్ను శ్రీనివాస్రెడ్డి, నాయకులు నలుమాచు రామకృష్ణ, గాండ్ల లక్ష్మణ్, కొత్తూరి నరేశ్, దండె కృష్ణ, మావురం మహేశ్, నరేశ్ రావన్, తదితరులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని వీణాధరి పాఠశాలలో వివేకానందుడి చిత్రపటానికి కరస్పాండెంట్ తిప్పర్తి శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి, విజేతలకు కరస్పాండెంట్ బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కొక్కుల శ్రీనివాస్, ఉపాధ్యాయులు ఆంజనేయులు, శ్రీనివాస్, మల్లేశం, పరశురాం, చంద్రశేఖర్, సంతోష్, జనార్దన్, సుప్రియ, సరిత, సువర్ణ, మనీషా, స్వప్న, లాస్రిత, సాహితీ, నూరువీస తదితరులు పాల్గొన్నారు. కొలిమికుంట గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో వివేకానందుడి చిత్రపటానికి సర్పంచ్ తాళ్లపల్లి సుజాత-శ్రీనివాస్ గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీటీసీ తోట కోటేశ్, ఉపసర్పంచ్ సత్తు తిరుపతి, వార్డు సభ్యులు సత్తు తిరుపతి, సత్తు పరశురాములు, ఆకుల సురేశ్, పంజాల బొంది, నెల్లి శంకరమ్మ, లక్ష్మయ్య, కో-ఆప్షన్ సభ్యురాలు తాళ్లపల్లి గంగ, పీఏసీఎస్ డైరెక్టర్ సత్తు నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని వెదిర అనుబంధ గ్రామం రాజాజీనగర్ క్రాస్రోడ్డులో జాతీయ యువజన అవార్డు గ్రహీత అలువాల విష్ణు ఆధ్వర్యంలో వివేకానందుడి జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరై వివేకానందుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతకు స్ఫూర్తి స్వామి వివేకానందుడు అని పేర్కొన్నారు. వెలిచాలలో వివేకానందుడి విగ్రహానికి మాజీ సర్పంచులు వీర్ల రవీందర్రావు, వీర్ల నర్సింగరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెలిచాల శ్రీ సరస్వతీ హైస్కూల్లో వివేకానందుడి చిత్రపటానికి కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్, కో-కరస్పాండెంట్ సత్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీపీ కలిగేటి కవిత, వెదిర సర్పంచ్ నాగుల సంగీత-రాజశేఖర్గౌడ్, దేశరాజ్పల్లి ఎంపీటీసీ వంచ మహేందర్రెడ్డి, జాతీయ యువజన అవార్డు గ్రహీత రేండ్ల కళింగ శేఖర్, ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, ఆర్ఐ బాలకిషన్, ఉప సర్పంచ్ ఎడవెల్లి సత్యనారాయణరెడ్డి, యువజన సంఘాల నాయకుడు గజ్జెల అశోక్, నాయకులు వివేకానంద, అర్జున్, రాజేశం, కమలాకర్, నరేశ్, నాగరాజు, కరంచంద్, మధు, శ్రీధర్, సురేశ్, శ్రీనివాస్, ఆనందం, మనోజ్, నవీన్రెడ్డి, అనిల్రావు, అక్షయ్వర్ధన్, రామ్చరణ్, తదితరులు పాల్గొన్నారు.
వివేకానందుడు చూపిన మార్గంలో యువత నడిచి ఉత్తమ వ్యక్తులుగా ఎదగాలని నాయకుడు పెరుక శ్రావణ్ పేర్కొన్నారు. మధురానగర్ చౌరస్తాలో వివేకానందుడి చిత్రపటానికి ఆయన పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు కోల అశోక్, రేండ్ల శ్రీనివాస్, సదాల భాస్కర్, మోతె శ్రీహరిరెడ్డి, శ్రీపతి రాజేంద్రప్రసాద్, ప్రభాకర్రెడ్డి, ఆకుల మనోహర్, సుధాకర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.