చొప్పదండి, అక్టోబర్ 24: రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కే తమ మద్దతు అని చొప్పదండి నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీలు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం బూరుగుపల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ను మైనార్టీలు మర్యాదపూర్వకంగా కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ, మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కొనియాడారు. నిరుపేద ఆడబిడ్డల పెళ్లికి షాదీముబారక్, రంజాన్ పండుగకు ఇఫ్తార్దావత్, బట్టల పంపిణీ, మైనార్టీల పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లు, మసీద్లలోని ఇమామ్, మౌజంలకు గౌరవ వేతనం, మైనార్టీ బంధు వంటి అనేక పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామన్నారు. అనంతరం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గెలుపొందాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు శుక్రొద్దీన్, కోఆప్షన్ సభ్యుల ఫోరం జిల్లా అధ్యక్షుడు షఫిక్ రహమాన్పాషా, జగిత్యాల ఫోరం అధ్యక్షుడు అజారుద్దీన్, గంగాధర, బోయినపల్లి కోఆప్షన్ సభ్యులు ఇస్మాయిల్, అజ్జు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు అజ్జు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
సుంకెపై అభిమానంతో కువైట్ నుంచి బూరుగుపల్లికి..
మండలంలోని బూరుగుపల్లి గ్రామానికి చెందిన దూలం రాజేశంగౌడ్ 15 ఏండ్లుగా కువైట్ వెళ్తున్నాడు. తెలంగాణ ఎన్నికల నగారా మోగిన సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్పై ఉన్న అభిమానంతో సెలవుపై స్వగ్రామం బూరుగుపల్లికి వచ్చాడు. బీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యే రవిశంకర్కు మద్దతుగా నెల రోజుల పాటు ప్రచారం చేసి, తన ఓటు హక్కును వినియోగించుకుని తిరిగి కువైట్ వెళ్తానని రాజేశంగౌడ్ తెలిపారు. కాగా, మంగళవారం రాజేశంగౌడ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ను బూరుగుపల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలువగా ఎమ్మెల్యే అభినందించారు. ఇక్కడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్రావు, నాయకులు దూలం శంకర్గౌడ్, గడ్డం స్వామి, ఉత్కం మురళి తదితరులు ఉన్నారు.