కలెక్టరేట్, మే 25: ఎంసెట్ ఫలితాల్లో కరీంనగరంలోని శ్రీచైతన్య విద్యా సంస్థల విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు. యూ మోహనసాయి 256, ఎ కీర్తన 896, కే డింపుల్ జస్టినా 1092, మధుకర్ 1109, ఎస్ శ్రీనివాస్ 1903, బీ సాయివినీత్ 2078, బీ రమణి 2770, డీ వంశీకృష్ణ 2943, డీ కార్తీక్ 2958 ర్యాంకులతో జయకేతనం ఎగరేశారు. అలాగే 8వేల లోపు 12 మంది, 10వేల లోపు 28 మంది ర్యాంకులు సాధించారు.
ఈ సందర్భంగా అత్యుత్తమ ర్యాంకులు పొందిన విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్రెడ్డి అభినందించారు. విజయసాధనలో పాలుపంచుకున్న అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ శ్రీచైతన్య కళాశాలల డైరెక్టర్ కర్ర నరేందర్రెడ్డి, డీన్ జగన్మోహన్రెడ్డి, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు మల్లారెడ్డి, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, రాధాకృష్ణ, ఏజీఎం శ్రీనివాస్, బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారు.