సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్, అక్టోబర్ 29: మంత్రి కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలువాలని కోరుతూ సిరిసిల్ల వికాస్ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు రూ.10,116 నామినేషన్ ఫీజు అందజేసి వారి అభిమానాన్ని చాటారు.
వికాస్ డిగ్రీ, పిజీ కళాశాల విద్యార్థులు కలిసి సేకరించిన నగదును ఆదివారం ప్రగతి భవన్లో సిరిసిల్ల బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు షేక్ సిఖిందర్ ద్వారా మంత్రి కేటీఆర్కు అందిం చారు. ఇక్కడ బీఆర్ఎస్వీ నాయకుడు సయ్యద్ అప్రోజ్, కోమ్ము రాజు, చందు, శ్రీనివాస్, పవన్, శ్రీకాంత్, తదితరులు ఉన్నారు.