పెద్దపల్లి కమాన్, ఏప్రిల్ 30 : పదో తరగతి ఫలితాల్లో పెద్దపల్లి ట్రినిటీ హైస్కూల్ విద్యార్థులు విజయభేరి మోగించారు. 29 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు కైవసం చేసుకున్నారు. మరో 24 మంది విద్యార్థులు 9.8 జీపీఏ, 40 మంది విద్యార్థులు 9.7 జీపీఏ సాధించారు. 28 మంది విద్యార్థులు 9.5 జీఏపీ, 29 మంది విద్యార్థులు 9.3 జీపీఏ, 28 మంది విద్యార్థులు 9.2 జీపీఏ, 20 మంది విద్యార్థులు 9.0 జీపీఏ పొందారు. అత్యుత్తమ ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను పెద్దపల్లిలోని పాఠశాలలో ట్రినిటీ విద్యాసంస్థల ఫౌండర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల పట్టుదల, ఉపాధ్యాయులు అందిస్తున్న నాణ్యమైన బోధనలో ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ఖ్యాతి తీసుకురావాలనే లక్ష్యంతో నాలుగు దశాబ్ధాలుగా తమ విద్యాసంస్థలు పని చేస్తున్నాయని చెప్పారు. ఇక్కడ ప్రిన్సిపాల్ రమేశ్, వైస్ ప్రిన్సిపాల్ కుమారస్వామి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉన్నారు.