పెద్దపల్లి కమాన్, ఏప్రిల్ 30 : పదో తరగతి ఫలితాల్లో పెద్దపల్లి ట్రినిటీ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. రాష్ట్ర స్థాయి ర్యాంకులతో సత్తా చాటారు. విద్యాసంస్థల ఫౌండర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లిలోని ట్రినిటీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు పుష్ఫగుచ్ఛాలు అందజేసి, అభినందించారు.
అనంతరం ఆయన మాట్లాడారు. తమ విద్యాసంస్థలకు చెందిన 353 మంది పరీక్షలు రాశారని, మొత్తం వందశాతం ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. పీ జ్యోతిర్మయి (588), ఓ ఆరాధ్య (586), ఎం శ్రీచైత్ర (584), కే హరిణి (582), జీ నితిక్ష (582), బీ నవ్యశ్రీ (581), వై యశ్వంత్ రుషి (581), ఎం శ్రీహర్షవర్ధన్ (580), డీ శ్రీకర్ (580) మార్కులతో రాష్ట్ర స్థాయిలో సత్తాచాటారని తెలిపారు.
మొత్తం పది మంది విద్యార్థులు 580కుపైగా మార్కులు, 39 మంది 570కుపైగా మార్కులు, 82 మంది 560కుపైగా మార్కులు, 117 మంది 550కుపైగా మార్కులు పొందారని తెలిపారు. ట్రినిటీ విద్యాసంస్థల్లో క్రమశిక్షణతో కూడిన విద్యనందిస్తున్నామన్నారు. పట్టుదలతో శ్రమిస్తే ఏదైనా సాధ్యమవుతుందడానికి తమ విద్యార్థులు ఫలితాలే నిదర్శమన్నారు.