తిమ్మాపూర్, అక్టోబర్22 : మహిళా సంక్షేమానికి పాటుపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలంటే ఆడబిడ్డల ఆశీస్సులుండాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. ఆదివారం రామకృష్ణకాలనీలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి పాల్గొన్నారు. మహిళలతో ముచ్చటించారు. గతంలో ఉన్న అభివృద్ధికి, ఇప్పటికి తేడా వివరించారు.
మార్పును ప్రతీ ఒక్కరూ గమనించాలని కోరారు. యువతకు అన్ని విధాలుగా అండగా ఉండేది తెలంగాణ ప్రభుత్వమేనని చెప్పారు. రసమయి బాలకిషన్ గెలుపు కోసం యువత దోహదపడాలన్నారు. తనను ఆశీర్వదించాలని ఆడబిడ్డలను రసమయి బాలకిషన్ కోరారు. బీఆర్ఎస్ నాయకుడు సిరికొండ అంజన్రావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పార్టీ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాస్రావు, సర్పంచ్ మీసాల అంజయ్య, ఎంపీటీసీ కిన్నెర సుజాత సారయ్య, సొసైటీ చైర్మన్ గుజ్జుల రవీందర్రెడ్డి, ఉపసర్పంచ్ ప్రణీత్రెడ్డి, నాయకులు దావు సంపత్రెడ్డి, పాల్గొన్నారు.