కమాన్చౌరస్తా, అక్టోబర్ 20 : జిల్లా కేంద్రంలో శుక్రవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. కేడీసీసీ బ్యాంక్లో మహిళా ఉద్యోగులు బతుకమ్మలు పేర్చి ఆడారు. వేడుకలను బ్యాంక్ సీఈవో సత్యనారాయణ రావు ప్రారంభించారు. డీజీఎం సుమమాల, ఏజీఎం శైలజ, స్రవంతి, చంద్రశేఖర్ రెడ్డి, రమేశ్, యూనియన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే, కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో కలెక్టర్ డాక్టర్ గోపి దంపతులు, పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే, లైఫ్లైన్ దవాఖానలో బతుకమ్మ సంబురాలు నిర్వహించగా, మహిళా సిబ్బంది ఆడిపాడారు. అలాగే, కెల్విన్ దవాఖానలో మేనేజింగ్ డైరెక్టర్ చింత సురేశ్ కుమార్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. వైద్యులు, మహిళలు బతుకమ్మ ఆడారు. అలాగే, మున్సిపల్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించగా, మహిళా ఉద్యోగులు ఆడిపాడారు.
కరీంనగర్ రూరల్, అక్టోబర్ 20: మండలంలోని బొమ్మకల్ గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చగా, సాయంత్రం గ్రామంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను పెట్టి మహిళలు, యువతులు ఆడిపాడారు. కృష్ణనగర్లో ఎంపీటీసీ ర్యాకం లక్ష్మి-మోహన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయగా, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి బతుకమ్మ ఆడారు. గ్రామ పంచాయతీ కార్యాలయం, గోకుల్నగర్, లక్ష్మీనగర్లో మహిళలు, యువతులు బతుకమ్మ ఆడారు. అనంతరం బతుకమ్మలను సమీపంలోని వాగు, చెరువులో నిమజ్జనం చేశారు. మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. కాగా, బతుకమ్మ వేడుకలకు మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు.
కొత్తపల్లి, అక్టోబర్ 20: కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్ (బావుపేట), ఖాజీపూర్ గ్రామాల్లో బతుకమ్మ వేడుకలను వైభవంగా జరుపుకొన్నారు. బావుపేటలో వేడుకలకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ హాజరై మహిళలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంగు రంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను ఒకచోట పెట్టి వాటి చుట్టు తిరుగుతూ మహిళలంతా పాటలు పాడుతూ ఆడారు. దాండియా నృత్యాలతో సందడి చేశారు. చిన్న, పెద్దా తేడా లేకుండా కొత్త బట్టలు ధరించి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం మళ్లీ రావమ్మా.. బతుకమ్మ అంటూ సమీపంలోని చెరువులో నిమజ్జనం చేశారు. వేడుకల్లో కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలత-మహేశ్, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు-సుప్రియ దంపతులు, సర్పంచ్ శాంత-శ్రీనివాస్, మహిళలు పాల్గొన్నారు.