మారుతీనగర్, జనవరి 13 : స్వరాష్ట్రంలో సీఎం క్రీడారంగానికి పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు. శుక్రవారం మెట్పల్లి పట్టణంలోని అంబేద్కర్ మినీ స్టేడియంలో సీఎస్ఆర్ నిధులు 50లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మెట్పల్లి ప్రాంత వాసి సింగరేణి సీఎండీ నడిమిట్ల శ్రీధర్ సొంత ఊరిపై మమకారంతో చిన్నారులకు, వృద్ధులకు ఉపయోగపడేలా స్టేడియంలో సౌకర్యాలను కల్పించాలనే ఉద్దేశ్యంతో అడుగగానే కోటి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని, మొదటగా 50లక్షల నిధులను మంజూరు చేశారని తెలిపారు.
మినీ స్టేడియంలో చేపట్టే వాకింగ్ ట్రాక్, పలు మౌలిక వసతులు, నిరుపయోగంగా ఉన్న షెడ్లను ఉపయోగంలోకి తేవాలని, పనులను ప్రణాళిక నక్షాను పరిశీలించి పంచాయతీ డీఈ గోపాల్, ఏఈ నిరంజన్కు సూచించారు. ఎమ్మెల్యేను పలువురు క్రీడాకారులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్రావు, కౌన్సిలర్లు మన్నేఖాన్, కో-ఆప్షన్ సభ్యుడు మార్గం గంగాధర్, ఎంపీపీ మారు సాయిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బర్ల సాయన్న, బీఆర్ఎస్వై నియోజకవర్గ నేత ఒజ్జెల శ్రీనివాస్, లింగంపల్లి సంజీవ్, పూదరి సుధాకర్, ఆరిసె మురళి, జక్కం బాబు,మున్సిపల్ ఏఈ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.