మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ మంచినీందిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది. దేశంలోనే స్వచ్ఛమైన జలాలు సరఫరా చేస్తూ మహిళల గోస తీర్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఒకప్పుడు తలాపునే గోదావరి పారుతున్న చుక్కనీరం దించండలో సమైక్య పాలకులు విఫలమయ్యారు. బిందెడు నీళ్ల కోసం మహిళలు కిలోమీటర్ల దూరం వెళ్లేవారు. కానీ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆడబిడ్డల మంచి నీటి కష్టాలను గట్టెక్కించారు.
– మంచినీళ్ల దినోత్సవంలో మంత్రి గంగుల కమలాకర్
కార్పొరేషన్, జూన్ 18: కరీంనగర్కు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తుండడంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టి, అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. నగరంలోని పద్మనగర్లో రూ.1.66 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన మేయర్ యాదగిరి సునీల్రావుతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు.
ఇప్పటికే ప్రధాన రహదారులతో పాటు డివిజన్లలోని అన్ని రోడ్లను సుందరంగా మార్చామన్నారు. నగరంలో మట్టి రోడ్డు లేకుండా సీసీ రోడ్లుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. వీటితో పాటు ప్రజలకు మెరుగైన సదుపాయాలను కల్పించేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. నగరంలో గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధి ఈ తొమ్మిదేళ్లలోనే చేసి చూపించామన్నారు. అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీకాంత్, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచస్థాయి సాంకేతికతతో అబ్బురపరిచే పరిజ్ఞానంతో పర్యాటక హబ్గా కేబుల్ బ్రిడ్జిని రాష్ట్రం గర్వపడే విధంగా రూపొందించామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి స్థానిక వీ కన్వెన్షన్ హాల్లో ఆయన మంత్రి కేటీఆర్ పర్యటనపై ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ, కరీంనగర్కు తలమానికంగా నిలువనున్న కేబుల్ బ్రిడ్జిని ఈనెల 21న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామన్నారు. మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలన్నారు. నగరాన్ని ఆనుకొని 24 టీఎంసీల డ్యాం ఏ నగరానికి లేదన్నారు. అంతటి అద్భుతమైన మానేరు నదిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే విధంగా కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ పనులు చేపట్టామన్నారు.
దేశంలోనే మొదటిసారిగా కేబుల్ బ్రిడ్జిపై 30X10 సైజులో స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈనెల 22న కూడా కేబుల్ బ్రిడ్జి వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈనెల 21, 22న నగరవాసులందరు పాల్గొనేలా చూడాలన్నారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో కేబుల్ బ్రిడ్జి పర్యాటకంగా మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు, మేయర్ యాదగిరి సునీల్రావు, అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్లాల్, గరిమా అగర్వాల్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ మధు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.