పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 25: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళిత బంధు పథకం పేద దళిత కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామానికి చెందిన కనుకుంట్ల లక్ష్మి-పోచాలు దంపతులకు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన కారుకు పూజలు చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డీఎంఆర్ మాట్లాడుతూ.. పేదల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో వినూత్న పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఆయా పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ చుంచు సదయ్య, ఉపసర్పంచ్ మాదాసి శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ ఇండ్ల రమేశ్, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు ఇండ్ల మహేందర్, వార్డు సభ్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.