MLA Sanjay | కోరుట్ల, ఫిబ్రవరి 15: కోరుట్ల పట్టణంలోని పురాతనమైన మహాదేవ స్వామి ఆలయంలో గాయకుడు, రచయిత నల్లగొండ గద్దర్ నరసన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆలయంలోని శివలింగాన్ని దర్శించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినాన కోరుట్లలోని మహాదేవ స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించు కోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తనను ఆలయ దర్శనానికి ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నరసన్నను ఆలయ కమిటీ సభ్యులు బీఆర్ఎస్ నాయకులు శాలువాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అంతకుముందు శివున్నీ స్తుతిస్తూ నరసన్న భక్తి గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గంగాధర్, అతిక్, రాజశేఖర్, ప్రభు, తదితరులు పాల్గొన్నారు.