ముస్తాబాద్, మార్చి 21: లోక్సభ ఎన్నిక ల నేపథ్యంలో పోలీస్ సిబ్బంది పారదర్శకం గా విధులు నిర్వర్తించాలని ఎస్పీ అఖిల్మహాజన్ సూచించారు. గురువారం ఆయన మం డల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను తనిఖీ చేశా రు. పోలీస్స్టేషన్ పరిసరాలతోపాటు పోలీస్స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకొని, తరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారుల సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపాలన్నారు. 24గంటలపాటు గ్రామాల్లో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, లోక్సభ ఎన్నికల సందర్భంగా పారదర్శకంగా విధులు నిర్వర్తించాలన్నారు. పోలీస్స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను విధి గా సందర్శించి, ఏమైనా సమస్యలుంటే వెం టనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలను గుర్తించి, ప్రత్యేక నిఘా ఏర్పా టు చేయడంతోపాటు అకడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని ఆదేశించారు. అలాగే జిల్లా సహరిహద్దు వెంకట్రావుపల్లె వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను ఎస్పీ తనిఖీ చేశారు. అప్రమత్తంగా ఉంటూ, ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎవరైనా 50వేల కంటే ఎక్కువ నగదును ఆధారాలు లేకుండా తరలిస్తే సీజ్ చేయాలని ఆదేశించారు. ఆయన వెంట సీఐ సదన్కుమార్, ఎస్ఐ శేఖర్రెడ్డి ఉన్నారు.
కలెక్టరేట్, మార్చి 21: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బ్యాంకుల పరిధిలో అనుమానిత లావాదేవీలపై దృష్టిపెట్టాలని బ్యాంకు అధికారులను అదనపు కలెక్టర్ పూజారిగౌతమి ఆదేశించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మో డల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో భాగంగా బ్యాంకుల కోఆర్డినేటర్లతో సమీకృత కలెక్టరేట్లోని తన చాంబర్లో అదనపు కలెక్టర్ గురువారం సమావేశమై, మాట్లాడారు. బ్యాంకుల నుంచి లక్ష నగదు తీసుకున్నా, ఖాతాలో వేసినా వారి వివరాలను ఎన్నికల వ్యయ పరిశీలకులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. 10లక్షల కంటే ఎక్కువ జమ అయినా, తీసుకున్న వారి వివరాలను ఆదాయ పన్నుశాఖ అధికారులకు తెలియజేయాలన్నారు.
ఆర్టీజీఎస్ ద్వారా ఒకేసారి ఎక్కువ ఖాతాలకు డబ్బులు బదిలీ చేసినా సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థు లు ప్రత్యేక ఖాతా తీసుకోవాలని, అన్ని లావాదేవీలు అదే ఖాతా నుంచి చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరుల ఖాతాలపై దృష్టిపెట్టాలని వివరించారు. ఏటీఎంలు, బ్యాంకులకు నగదు తరలించే ముందు వాహనం నంబర్, వెళ్లే వారి పూర్తి వివరాలు, ఎంత డబ్బు తీసుకెళ్తున్నారు.? తేదీ తదితర వివరాలు పక్కాగా ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం ఈఎస్ఎంఎస్(ఎలక్షన్ సీజ్యుర్ మేనేజ్మెంట్ సిస్టమ్) యాప్ వినియోగంపై వివరించారు. ఎన్నికల నియమావళిని బ్యాం కు అధికారులు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఎల్డీఎం మల్లికార్జున్రావు, ఆయా బ్యాంకుల కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.