సిరిసిల్ల తెలంగాణ చౌక్, మే 25: తండ్రి మరణవార్త విని గుండెపోటుతో కుప్పకూలిన మహిళను ఓ కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. సిరిసిల్లలోని గాంధీనగర్కు చెందిన చిలగాని అనూహ్య శనివారం ఉదయం తండ్రి మరణవార్త విని బోరున విలపిస్తూ చాతిలో నొప్పి అంటూ కుప్పకూలిపోయింది. గమనించిన కుటుంబసభ్యులు కేకలు వేయడంతో అటుగా రోడ్డుపై నుంచి వెళ్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ గమనించి వారి ఇంట్లోకి వెళ్లాడు.
అనూహ్యకు గుండెపోటు వచ్చిందని గుర్తించి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. తర్వాత ఆమెను సొంత వాహనంలో పట్టణంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించాడు. చాకచక్యంగా వ్యవహరించి మహిళా ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ను ఎస్పీ అఖిల్మహాజన్, పలువురు పోలీసు అధికారులు అభినంచారు. శ్రీనివాస్కు అనూహ్య కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.