శ్రీరాంపూర్, మే 6:సింగరేణిలో 665 గిరిజన బ్యాక్లాగ్ పోస్టుల పరీక్షా ఫలితాల నిరీక్షణకు తెరపడింది. ఈ నియామకాలపై కొందరు పలు రకాల అభ్యంతరాలతో హైకోర్టులో కేసువేయడంతో ఫలితాల విడుదల నిలిపివేయగా, సీఎం కేసీఆర్ ఆదేశాలు, సంస్థ సీఎండీ కృషితో నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త అందింది. ఈ మేరకు సంస్థ గురువారం ఫలితాలను వెల్లడించగా, మెరిట్ జాబితా అభ్యర్థులకు నెలరోజుల్లోగా బదిలీ వర్కర్ ఉద్యోగానికి ఉత్తర్వులు అందించనున్నది.
సింగరేణిలో 665 గిరిజన బ్యాక్లాగ్ పోస్టుల పరీక్షా ఫలితాలను గురువారం యాజమాన్యం విడుదల చేసినట్లు డైరెక్టర్ (పా) బల రాం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇం దుకు సంబంధించి 2017 జూలైలో నోటిఫికేష న్ రాగా, 60 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. 37,935 మందికి కాల్ లెటర్లు జారీ చేశామని, 2018, జూన్ 10న పరీక్ష నిర్వహించామని పేర్కొన్నారు. 27,279 మంది హాజరైనట్లు వెల్లడించారు. ఈ నియామకాలపై కొందరు పలు రకాల అభ్యంతరాలతో హైకోర్డు లో కేసు వేయడంతో ఫలితాలు నిలిపివేసినట్లు చెప్పారు. దీనిపై సీఎం కేసీఆర్, సీఎండీ శ్రీధర్ ఆదేశాలతో నిపుణుల సలహాతో న్యాయపరమైన చిక్కులను పరిష్కరించుకొని తాజాగా మెరిట్ జాబితాను ప్రకటించినట్లు వివరించారు. ఎంపికైన అభ్యర్థులకు నెల రోజుల్లోగా నియామక ఉత్తర్వులు అందజేస్తామని తెలిపారు. సాధారణ వైద్య పరీక్షల అనంతరం వివిధ ఏరియాల్లోని భూగర్భ గనుల్లో విధులు కల్పిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సీఅండ్ఎండీ శ్రీధర్, డైరెక్టర్ (పా) బలరాంకు గిరిజన అభ్యర్థులు, గిరిజన సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం, సీఎండీకి ధన్యవాదాలు
మెరిట్ లిస్టు ప్రకటించేందుకు సహకరించిన సీఎం కేసీఆర్, ఎంపీ మాలోతు కవిత, సీఎండీ శ్రీధర్, సింగరేణి యాజమాన్యం, డైరెక్టర్ (పా) ఎన్ బలరాంకు గిరిజన అభ్యర్థులు, గిరిజన సంఘాల ప్రతినిధుల తరఫున టీబీజీకేఎస్ కార్పొరేట్ చర్చల ప్రతినిధి ధరావత్ మంగీలాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసును పరిష్కరించాలని సీఎం కేసీఆర్కు ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు చేసిన ఎమ్మెల్యేలు, టీబీజీకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు మాదవ్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ పంతులునాయక్కు ఎస్టీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలిపారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
రాష్ట్ర ప్రభుత్వ కృషితో 665 మంది గిరిపుత్రులు ఉద్యోగాలు పొందడంతో మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్ ఏరియాలోని టీబీజీకేఎస్ కార్యాల యం ఎదుట సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీబీజీకేఎస్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పా లాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ మాజీ ఉపాధ్యక్షుడు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జే రవీందర్ మాట్లాడుతూ 2018 నుంచే వీరు విధుల్లో చేరాల్సి ఉండగా, కొందరు రాజకీయ కుట్రతో కోర్టుకు వెళ్లారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు బడికెల సంపత్, ఓ రాజశేఖర్, శంకర్రావు పాల్గొన్నారు.