సింగరేణి ఆలిండియా 52వ రెస్క్యూ పోటీలు ఆర్జీ-2 ఏరియా రెస్క్యూ స్టేషన్లో సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీలకు ముఖ్య అతిథులుగా ధన్బాద్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ శ్యామ్మిశ్రాతోపాటు సింగరేణి సంస్థ డైరెకర్లు బీ సత్యనారాయణరావు, ఎన్వీకే శ్రీనివాస్, జీ వెంకటేశ్వర్రెడ్డితోపాటు, డీడీఎంస్ అధికారులు హాజరై ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా బొగ్గు ఆధారిత 10 సంస్థలు, మెటల్ ఆధారిత ఆరు సంస్థల నుంచి మొత్తంగా 25 టీంలు తరలివచ్చాయి.
ముందుగా డీఎంఆర్ఎస్ శ్యామ్మిశ్రా జెండాను ఆవిష్కరించి రక్షణ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం రెస్క్యూ టీం సభ్యులను పరిచయం చేసుకుని గౌరవ వం దనం స్వీకరించారు. కాగా, డ్రా పద్ధతిలో టీంలకు నం బర్లను కేటాయించగా, ఆయా జట్లు వరుసగా పరేడ్, డ్రిల్, ఫస్ట్ ఎయిడ్, రెస్క్యూ రికవరీ అంశాలపై డ్రిల్ నిర్వహించారు.
గనిలో ప్రమాదంలో చిక్కుకున్న బాధితులను రక్షించడం, బండరాయి పడ్డ ప్రాంతానికి చేరుకుని బాధితుడికి అపాయం జరుగకుండా బండను తొలగించడం, నీటి ప్రవాహాన్ని అరికట్టడానికి ఇసుక వాల్ కట్ట డం, ప్రమాద స్థలంలో అడ్డుగా ఉన్న ఇనుప రాడ్ల ను, కర్రలను తొలగించడంతోపాటు ఆపదలో వున్న బాధితుడికి ఆత్మస్థయిర్యా న్నిస్తూ ఆక్సిజన్ అందించే ప్రదర్శన ఎంతో ఆకట్టుకున్నది. పలువు రు ఈ ప్రదర్శనను కార్మిక కుటుంబీకులు తిలకించి ఆశ్చర్యచకితులయ్యారు.
సింగరేణి కాలరీస్ కంపెన్ లిమిటెడ్-2, భారత్ కోల్ లిమిటెడ్, సెంట్రల్ కోల్ఫీల్డ్ లిమిటెడ్, వెస్ట్రన్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్, మహానంది కోల్ ఫీల్డ్ లిమిటెడ్, ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్, స్టీల్ ఆథారాటీ లి మిటెడ్, టాటా స్టీల్ లిమిటెడ్, రిలయన్స్ సిమెంటు కంపెనీ లిమిటెడ్, సన్ప్లాగ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ కంపెనీతో పాటు మెటల్ కంపెనీలు అయిన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్, మాంగనీసు ఓర్ ఇండియా లిమిటెడ్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, ఇండియా మోటార్స్ అండ్ ఫెర్రో ఆల్లో మ్స్ లిమిటెడ్ కంపెనీలు పాల్గొన్నాయి.
సు మారు 175మందిపైగా రెస్క్యూ సభ్యులు, జీఎంలు, ఇతర అన్ని విభాగాల అధికారులు రావడంతో ఇక్కడి రెస్క్యూస్టేషన్ కోలహలంగా మారింది. ఈ కార్యక్రమంలో డీఎంఎస్ నాగేశ్వర్రావు, సంజీవ్ కుమార్, జార్జీజాన్, సేఫ్టీ జీఎం గురువయ్య, అధికారుల సంఘం అధ్యక్షుడు జక్కం రమేశ్, ఏరి యా జీఎం ఎల్వీ సూర్యనారాయణ, రెస్క్యూ జీ ఎం వెంకటేశ్వర్లు, ఆర్జీ రీజియన్ రక్షణ జీఎం సందనాల సాంబయ్య, రెస్క్యూ మేనేజర్ బింగి మాధవరావు, డీజీఎం(ప) రాజేంద్రప్రసా ద్, భాస్కర్రెడ్డి, తిరుపతి, సీనియర్ పీవోలు పాల్గొన్నారు.
సింగరేణి ఆలిండియా 52వ రెస్క్యూ పోటీల ఆరంభం అదిరింది. రామగుండం ఆర్జీ-2 ఏరియా రెస్క్యూస్టేషన్లో ఈ నెల 11 నుంచి 15 దాకా తలపెట్టిన ఈ పోరుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 25 రెస్క్యూ జట్లు తరలిరాగా, సోమవారం తొలిరోజు పరిచయ కార్యక్రమం, మాక్ డ్రిల్ జరిగింది. నేటి నుంచి వివిధ సందర్భాల్లో ఎదురయ్యే ప్రమాదాల నుంచి కార్మికులు ఎలా బయటపడాలో వివరిస్తూనే, ఎలా కాపాడవచ్చో అనే అంశాలపై ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అందులో ఉత్తమ ప్రతిభచూపిన జట్లకు బహుమతులు ప్రదానం చేయనుండగా, ఆయా విభాగాల ఉన్నతాధికారులు తరలివచ్చారు.