విద్యానగర్, జనవరి 9 ; కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో పేషెంట్ కేర్లు కరువయ్యారు. వైద్యం కోసం వచ్చిన రోగులను వీల్ చైర్లు, స్ట్రెచర్ కుటుంబ సభ్యులే తరలించాల్సి వస్తున్నది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్కు చెందిన వినోద్కుమార్కు రెండు నెలల క్రితం కాలు విరిగింది. ఇదే దవాఖానలో శస్త్ర చికిత్స చేయగా, మంగళవారం రివ్యూ కోసం వచ్చాడు. డాక్టర్ వద్దకు తీసుకెళ్లేందుకు అకడ పేషెంట్ కేర్ లేకపోవడంతో వినోద్ భార్యనే స్ట్రెచర్ను నెట్టుకుంటూ తీసుకెళ్లింది. అకడే ఉన్న అదనపు ఆర్ఎంవో డాక్టర్ నవీన వెంటనే గమనించి, సిబ్బందిని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డిని సంప్రదించగా, ఇదే సమయంలో ఇంకో రోగికి అత్యవసర చికిత్స కావడంతో పేషెంట్ కేర్ వెళ్లారని, అయినా దీనిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు.