కమాన్ చౌరస్తా, ఫిబ్రవరి 21: కరీంనగర్ మార్కెట్ రోడ్డు వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన శోభాయాత్ర కనులపండువలా సాగింది. అలంకరించిన గరుడ వాహనంతో కూడిన రథంపై శ్రీవారి ఉత్సవ మూ ర్తులను ఉంచి మార్క్ఫెడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఊరేగింపు రాంనగర్, మంకమ్మతోట, తెలం గాణచౌక్, బస్టాండ్, టూటౌన్ పోలీస్ స్టేషన్ గుండా ఆలయానికి చేరుకున్నది. శోభాయాత్రలో భక్తులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీవారికి పట్టు వస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కాగా, మంత్రి స్వయంగా శ్రీవారి వాహనాన్ని నడిపారు. కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్కుమార్ పాల్గొన్నారు.