సిరిసిల్ల పట్టణంలో శివభక్త మార్కండేయ స్వామి జయంతి వేడుకలు సోమవారం నేత్రపర్వంగా జరిగాయి. ఉదయం మార్కండేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించగా, సాయంత్రం ఆలయం నుంచి పురవీధులగుండా నిర్వహించిన స్వామివారి శోభాయాత్ర కనులపండువగా సాగింది. చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. స్థానిక పాత బస్టాండ్లో నేతన్న విగ్రహానికి నాయకులు పూలమాలలు వేశారు. జై మార్కండేయ నినాదాలతో పట్టణం మార్మోగింది.
వేడుకల్లో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు గాజుల బాలయ్య, పట్టణాధ్యక్షుడు గోలి వెంకటరమణ, టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, పద్మశాలీ సంఘం మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, పద్మశాలీ యువజన సంఘం అధ్యక్షుడు గుండ్లపల్లి పూర్ణచందర్ పాల్గొన్నారు.
– సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 12