సినీనటి, యాంకర్ అనసూయ ఆదివారం సిరిసిల్లలో సందడి చేసింది. స్థానిక గాంధీచౌరస్తాలోని విశాల షాపింగ్ మాల్లో ఏర్పాటుచేసిన పట్టుశారీస్ అండ్ మెన్స్ ఎత్నిక్ ఫ్లోర్స్ ప్రారంభోత్సవానికి ఆమె హాజరైంది. సిరిసిల్ల పట్టు చీరలను చూసి మురిసిపోయింది.
-సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 26
సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 26: సినీనటి, యాంకర్ అనసూయ ఆదివారం సిరిసిల్లలో సందడి చేసింది. స్థానిక గాంధీచౌరస్తాలోని విశాల షాపింగ్ మాల్లో ఏర్పాటుచేసిన పట్టుశారీస్ అండ్ మెన్స్ ఎత్నిక్ ఫ్లోర్స్ ప్రారంభోత్సవానికి ఆమె హాజరైంది. జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళతో పాటు మాల్ నిర్వాహకులు శ్రీనివాస్, విష్ణు, వెంకన్నతో కలిసి పట్టుశారీస్ అండ్ మెన్స్ ఎత్నిక్ ఫ్లోర్స్ను అనసూయ ప్రారంభించింది. సిరిసిల్ల పట్టు చీరలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో లభించే పట్టు చీరలు ఇక్కడ అందుబాటు ధరల్లో ఉన్నాయని నిర్వాహకులను అభినందించింది.
సిరిసిల్ల ప్రజలకు విశాల షాపింగ్ మాల్లో నాణ్యమైన చీరలు అందుబాటు ధరల్లో అందిస్తున్నారని తెలిపింది. ప్రతి గంటకో లక్కీ డ్రా ఆఫర్ను కస్టమర్లు వినియోగించుకోవాలని సూచించింది. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, విశాల షాపింగ్ మాల్కు వచ్చిన కస్టమర్లు ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు ఆసక్తి చూపారు. కార్యక్రమంలో విశాల షాపింగ్ మాల్ యాజమాన్యంతో పాటు బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, పలువురు కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.