ధర్మపురి, అక్టోబర్22: మంత్రి కొప్పుల ఈశ్వర్ భారీ మెజార్టీతో గెలవాలని కాంక్షిస్తూ దొంతాపూర్కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఏఎంసీ డైరెక్టర్ ర్యాగల నారాయణ ధర్మపురి నృసింహ క్షేత్రానికి ఆదివారం పాదయాత్ర చేశారు. గ్రామంలో నుండి ధర్మపురికి 15కిలోమీటర్లు నడిచి స్వామివారికి ముడుపు కట్టారు. మార్గమధ్యలో జైన గ్రామంలోని ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలోనూ ముడుపు కట్టారు. బీఆర్ఎస్ పాలనలో మంత్రి ఈశ్వర్ ప్రత్యేక చొరవ వల్ల ధర్మపురి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, మరింత అభివృద్ధి చెందాలంటే మరో ఐదేళ్లు ఆయన సేవలు అవసరమని, అందుకే ముడుపు కట్టినట్లు నారాయణ తెలిపారు.
పాదయాత్రలో దొంతాపూర్ సర్పంచ్ కొండపెల్లి రామ్చందర్రావ్, జైన పీఏసీఎస్ చైర్మన్ సౌళ్ల నరేశ్, సీనియర్ నాయకులు కొండపెల్లి కిషోర్రావ్, ఆరెపెల్లి ఎంపీటీసీ కుంబాల రమేశ్, దొంతాపూర్ మాజీ సర్పంచులు గణపతి, బుచ్చన్న, మోహన్, జైన సర్పంచ్ కుడిక్యాల మహేశ్, రాజారం మాజీ సర్పంచ్ బుచ్చన్న, జైన బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రమేశ్, ఏఎంసీ డైరెక్టర్ గాజుల సత్తయ్య, యూత్ నాయకులు దుర్గం రవీందర్నేత తదితరులున్నారు. అలాగే మంత్రి ఈశ్వర్ కూతురు నందిని ధమ్మన్నపేట వద్ద పాదయాత్రలో కలిసి ధర్మపురి దాకా పాదయాత్రగా వచ్చింది. తన తండ్రి కొప్పుల ఈశ్వర్ పై ఇంతటి అభిమానం చూపుతున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.