Jafarkhanpet | కాల్వశ్రీరాంపూర్, జూన్ 8 : కాల్వశ్రీరాంపూర్ మండలంలోని జాఫర్ ఖాన్ పేట లో హెచ్ఎం ప్రకాష్ రావు అన్నారు. గ్రామంలో ఉపాధ్యాయుల బృందంతో కలిసి ఆయన బడి బాట కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అన్ని వీధులలల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్లే 15మంది పిల్లలను బడిలో చేర్పించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాదగిరి జ్యోత్స్న శ్రీనివాస్, ఉపసర్పంచ్ శ్రావణి శ్రవణ్, వార్డ్ మెంబర్స్ చిన్ని, ఆనంద్, సాగర్, సుగుణ, చందర్, భార్గవి, రాజకుమార్, అజయ్, వెంకటక్క, చైర్మన్ జ్యోతి, పంచాయతీ కార్యదర్శి శంకర్, ఉపాధ్యాయులు మమత, ఆరోగ్యమ్మ, వసంత, దేవేందర్, రమేష్, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.