కార్పొరేషన్, జనవరి 23: అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రతి ఆడబిడ్డా అండగా నిలిచి ఆశీర్వదించాలని కోరారు. సోమవారం కరీంనగర్ జడ్పీ సమావేశ మందిరంలో 132 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలో ఆడబిడ్డ పెళ్లికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
గతంలో పాలకులు ఏ రోజు కూడా తెలంగాణ పేదల సంక్షేమం కోసం ఆలోచన చేయలేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ పేదల బతుకులు మార్చాలన్న ఆలోచనతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. మరోసారి రాష్ట్ర ప్రజల్ని మభ్య పెట్టేందుకు ఆంధ్ర నాయకులు వస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దని సూచించారు. ఒకసారి నమ్మితే భవిష్యత్ తరాలు నష్టపోవాల్సి వస్తుందన్నారు.
వ్యవసాయానికి 24 గంటల కరెంటు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. రైతుబంధు కింద ఆర్థిక సాయం అందించడంతో పాటు ఎరువులను సకాలంలో అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల పాలనలోనే రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేశామని, మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్రావు, కొత్తపల్లి మున్సిపల్ ఛైర్మ్న్ రుద్రరాజు, ఎంపీపీలు పిల్లి శ్రీలత, లక్ష్మయ్య, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్, కార్పొరేటర్లు గంట కల్యాణి, గందె మాధవి, ఐలేందర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
కార్పొరేషన్, జనవరి 23: నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయం మీసేవాలో 198 మందికి 67,32,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేశారు. ఇందులో నగరానికి చెందిన 99 మందికి 35.13 లక్షలు, కరీంనగర్ రూరల్కు చెందిన 37 మందికి 13.21 లక్షలు, కొత్తపల్లి మండలానికి చెందిన 31 మందికి 8.64 లక్షలు, ఇతరులకు చెందిన 31 మందికి 10.33 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స తీసుకున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్రావు, నాయకులు సంపత్రావు, చల్ల హరిశంకర్, రవీందర్, యాదయ్య, అశోక్రావు, సతీశ్ పాల్గొన్నారు.