Dharmapuri | ధర్మారం, జూలై 11 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని సాయి మణికంఠ మోడ్రన్ హై స్కూల్ లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఏడో తరగతి విద్యార్థి టీ సుహాని అండర్ – 12 విభాగం, మూడో తరగతి చదువుతున్న సునైన అండర్-8 విభాగంలో ఎంపికయ్యారు.
ఇటీవల జిల్లా స్థాయి పోటీలలో వీరిద్దరూ ప్రతిభ కనభరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కాగా వీరు ఈనెల 12 నుండి హైదరాబాద్ లోని గార్డియమ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో జరగానున్న పోటీల్లో వీరు పాల్గొంటారు. సదరు విద్యార్థులను శనివారం పాఠశాల లో కరస్పాండెంట్ జైన సురేష్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ జైన రమాదేవి అభినందనలు తెలిపారు.