కాల్వశ్రీరాంపూర్, జనవరి 11: రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని వెన్నంపల్లిలో మంగళవారం రైతుబంధు వారోత్సవాలను నిర్వహించగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలు, ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రైతుబంధు పథకం రూ.50వేల కోట్ల మైలురాయిని దాటడం ఆనందంగా ఉందన్నారు. రైతుబంధు పథకంలో భాగంగా వెన్నంపల్లి రైతుల ఖాతాల్లో రూ.6.70కోట్లు జమయ్యాయని పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు అండగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, విండో చైర్మన్లు చదువు రాంచంద్రారెడ్డి, గజవెళ్లి పురుషోత్తం, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కొట్టె సుజాత-రవీందర్, వైస్ చైర్మన్ బూసి సదాశివరెడ్డి, ఆర్బీఎస్ మండ ల కోఆర్డినేటర్ నిదానపురం దేవయ్య, సర్పంచ్ కాసం శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ జెట్టి దేవన్న, టీఆర్ఎస్ నాయకులు బీసగోని తిరుపతి, మేడుదుల రాజ్కుమార్, తొట్ల శ్రీనివాస్, నాగభూషణం, ఎల్కపెల్లి చంద్రయ్య, కూకట్ల నవీన్, సర్పంచులు, ఎంపీటీసీలు, ఆర్బీఎస్ గ్రామ కోఆర్డినేటర్లు, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు, అధికసంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
ధర్మారం మండలం దొంగతుర్తిలో..
దొంగతుర్తి గ్రామం లో నిర్వహించిన వేడుకలకు నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పాకాల రాజయ్య, జిల్లా సభ్యుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి హాజరయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. రైతువేదిక వరకు ర్యాలీ నిర్వహించారు. రైతువేదిక వద్ద అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సర్పంచ్ పాలకుర్తి సత్తయ్య, ఎంపీటీసీ దాడి సదయ్య, పత్తిపాక ప్యాక్స్ చైర్మన్ నోముల వెంకట్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మిట్ట తిరుపతి, కటికెనపల్లి ఎంపీటీసీ సూరమల్ల శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ గూడూరి లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ చొప్పరి చంద్రయ్య, మాజీ సర్పంచ్ జుంజిపల్లి రమేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి కూరపాటి శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు బాలసాని లింగయ్య, ఆర్బీఎస్ మండల సభ్యుడు పాక వెంకటేశం, చింతల తిరుపతి, వివిధ గ్రామాల కోఆర్డినేటర్లు మూల మల్లేశం, కల్లెం జలపతిరెడ్డి, పాలకుర్తి మల్లేశం, నాయకులు గుజ్జేటి కనకలక్ష్మి, దేవి నళినీకాంత్, బండి సురేశ్, సంకరి రాజయ్య, ఈర్ల మహేశ్, అలువాల సంతోష్, అనువాల సాగర్, ముదాం శ్రావణ్, అలువాల సంతోష్ పాల్గొన్నారు.