ధర్మారం, జూన్ 6: ‘మన ఊరు- మనబడి’ ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు కొత్త రూపు వస్తున్నదని ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ తెలిపారు. ధర్మారం మండలం నంది మేడారంలో ఆమె ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డితో కలిసి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా జడ్పీ ఉన్నత పాఠశాలలో హెడ్మాస్టర్ లలిత, ప్రజా ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించి సమన్వయంతో పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఎంపీపీ సూచించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో పాఠశాల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.
అనంతరం ‘మన ఊరు- మనబడి’ ద్వారా రూ. 29 లక్షల నిధులతో డైనింగ్ హాలు, కిచెన్ షెడ్డు నిర్మాణానికి పాఠశాల ఆవరణలో భూమి పూజ చేశారు. పనులు నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆమె ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట, అంగన్వాడీ అధ్వర్యంలో నిర్వహించిన అంగన్వాడీ బడిబాట ర్యాలీలకు ఆమె హాజర య్యారు. మండలంలో ‘మన ఊరు- మనబడి’ కా ద్వారా తొలి విడుతలో 18 పాఠశాలలను ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేయిస్తున్నామని ఎంపీపీ వెల్లడించారు. కార్యక్రమంలో సర్పంచ్ సామంతుల జానకి, జడ్పీ కోప్షన్ సభ్యుడు ఎండీ సలామొద్దీన్, హెచ్ఎం లలిత, ఎంపీటీసీలు కట్ట స్వామి సరోజ, మిట్ట తిరుపతి, సింగిల్ విండో వైస్ చైర్మన్ సామంతుల రాజమల్లు, ఉప సర్పంచ్ కట్ట రమేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి నాడెం శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు రాసూరి రాజ్కుమార్, జీపీ ప్రత్యేక అధికారి పంపరి శంకర్, పంచాయితీ కార్యదర్శి ఎండీ ముజీబ్, పీఎస్ హెచ్ఎం అత్తె రాజారాం, నాయకులు సాన రాజేందర్, గోళ్ల సంతోష్ అంగన్వాడీ టీచర్లు మేడారం అరుణ, బోగె శ్రీలత, సాన రజిత, చెనెల్లి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
గర్రెపల్లిలో అవగాహన ర్యాలీ
సుల్తానాబాద్రూరల్, జూన్ 6: గర్రెపల్లిలో సోమవారం అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో బడిబాట నిర్వహించారు. రెండేళ్ల వయసు దాటిన పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని ప్రచారం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లోని సౌకర్యాలను వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శశికళ, మండల స్పెషల్ ఆఫీసర్ నారాయణ, గ్రామ ప్రత్యేకాధికారి సురేందర్రెడ్డి, సర్పంచ్ వీరగోని సుజాత-రమేశ్గౌడ్, ఎంపీటీసీ అనూష, ఉప సర్పంచ్ మధూకర్, హెచ్ఎం మాధవీలత, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, అంగన్వాడీ టీచర్ల స్వర్ణలత, రమా, మాధవి ఉన్నారు.