సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 18: సిరిసిల్లలోని కొండాలక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డుపైనే మూడు గంటల పాటు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. వేములవాడ డిపోకు చెందిన బస్సు ఆదివారం వేములవాడ నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. సిరిసిల్ల మీదుగా వెళ్తున్న క్రమంలో సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో స్థానిక రేణుక ఎల్లమ్మ జంక్షన్లోని కొండా లక్ష్మణ్బాపూజీ విగ్రహం వద్ద సడెన్గా నిలిచిపోయింది.
దీంతో డ్రైవర్ అధికారులకు సమాచారం అందించగా, దాదాపు మూడు గంటలు గడిచినా ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. రోడ్డుపై భైఠాయించి ఆందోళనకు దిగుతున్న క్రమంలో మరో బస్సును ఏర్పాటుచేసి ప్రయాణికులను పంపించారు.