Metpally | మెట్ పల్లి : మెట్పల్లి పట్ట ణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో 63వ జాతీయ రహదారి పక్కనగల చెట్టును మంగళవారం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎనిమిది మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. కాగా క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి వైద్యచికిత్స అందించారు. నిజామాబాద్ డిపోకు చెందిన ఎలక్ట్రానిక్ ఆర్టీసీ బస్సు మెట్ పల్లి మీదుగా కరీంనగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.