పెద్దపల్లి/సుల్తానాబాద్ అక్టోబర్ 28: పెద్దపల్లి గడ్డ..గులాబీ పార్టీ అడ్డా అని..మూడోసారి బీఆర్ఎస్ గెలుపు ఖాయం అని పెద్దపల్లి ఎమ్మె ల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే మోరిలో వేసినట్టేనని అన్నారు. శనివారం ఓదెల, ఎలిగేడు, సుల్తానాబాద్ మండలాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతే నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని చెప్పారు. సీసీరోడ్లు నిర్మించానని, అప్రోచ్ రోడ్లు వేయించానని పేర్కొన్నారు.
నీటి సమస్యను పరిష్కరించానన్నారు. కానీ అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్, బీజేపీ నాయకులు అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఊర్లకు వచ్చే ఆ పార్టీల నాయకులను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చేసిన పనులు, అందుబాటులో ఉంటున్న తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, ఉప సర్పంచ్ తీర్థాల కుమారస్వామి, కన్వీనర్ కనికిరెడ్డి సతీశ్, మాజీ ఎంపీపీ బుద్దె రామస్వామి, గ్రామ శాఖ అధ్యక్షుడు పోలోజు రమేశ్, ఆర్బీఎస్ గ్రామ కో -ఆర్డినేటర్ బోడకుంట మహేందర్, పెద్దపల్లి మారెట్ డైరెక్టర్ బుద్దె కుమారస్వామి, మాజీ డైరెక్టర్ బోడకుంట నరేశ్, పెరుక సంఘం అధ్యక్షుడు గోపతి ఎల్లయ్య, ఉపాధ్యక్షుడు రాందేని స్వామి, నాయకులు సర్వర్, చింతం మొగిలి, పడాల మల్లయ్య, కనికిరెడ్డి సురేష్, నాగపురి పైడి, ఎలిగేడులో ఎంపీపీ ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బైరెడ్డి రాంరెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు కప్పల ప్రవీణ్, కవ్వంపల్లి బాపయ్య, కనుకుంట్ల చంద్రయ్య, గొసె తిరుపతి, సుల్తానాబాద్లో అమ్ముల భూమయ్య గెల్లు ముత్యాలు, గెల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఓదెలకు చెందిన కాంగ్రెస్ నాయకులు బియ్యాల ఐలయ్య, తీగల సదానందం, ముద్దసాని చేరాలు, ఎంబడి పోచాలు, ముద్దసాని రాజయ్య, దిడ్డిగి శంకరయ్య, రాందేని తిరుపతి, రాందేని స్వామి, రాందేని శ్రీనివాస్, రాందేని కొంరయ్య, రాందేని రమేశ్, దొంగరి రాకేశ్, రాందేని శ్రీనివాస్ ఎలిగేడు మండలం సుల్తాన్పూర్కు చెందిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొసె శంకర్, నాయకులు గొసె లచ్చ య్య, కవ్వంపల్లి లస్మయ్య, రాయపాక దుర్గ య్య, బెజ్జంకి రవి, గొసె రాజయ్య, గొసె స్వామి, జంగం శంకరయ్య, రాయపాక శ్రీనివాస్. సుల్తానాబాద్ యువ ఆత్మీయ సమ్మేళనంలో యాదవనగర్కు చెందిన చింతల వెంకటేష్, అనగండ శ్రీనివాస్, మోటం గణేష్, అనగండ రవి, అనగండ రమేష్, అనగండ నంబ య్య పార్టీలో చేరారు.