Kolanur | ఓదెల, మార్చి 26: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇందులో వివిధ రకాల స్పెషలిస్ట్ డాక్టర్లు ప్రత్యేక క్యాంపులో పాల్గొన్నారు.
278 మందికి ఇక్కడ సాధారణ వైద్య పరీక్షలు చేశారు. కాగా, 121 మందికి జనరల్ వైద్య పరీక్షలతో పాటు 32 మంది స్త్రీలకు, 30 మంది పిల్లలకు, 34 మంది ఎముకలకు, 38 మంది కంటి, 23 మంది దంత వైద్య నిపుణులతో పరీక్షలు జరిపారు. ఈ వైద్య శిబిరానికి పీహెచ్సీ పరిధిలోని గ్రామాల ప్రజల హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పల్లె కనకయ్య, రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దెల నరసయ్య, కొల్లూరి మధునయ్య, పీహెచ్సీ డాక్టర్ సంజనేష్, అశోక్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.