Minister Ponnam | వీణవంక, ఏప్రిల్ 7 : కరీంనగర్ జిల్లా కేంద్రంలో సగరుల కోసం భూమి కేటాయించాలని కోరుతూ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను ఆ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాసు సగర కోరారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్కు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వారు మంగళవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సగరుల సమస్యలు, వారి అభివృద్ధికి తీసుకోవాల్సిన విషయాలపై మంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం స్పందిస్తూ కరీంనగర్ కలెక్టర్కు సిఫార్సు చేశారు. అనంతరం పొన్నం మాట్లాడుతూ సగరుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.