ధర్మారం,జూలై25 : ఎస్సారెస్పీ డీ 83/బీ బ్రాంచ్ కాలువ తూములు, డ్రాపుల మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి. మం త్రి కొప్పుల ఈశ్వర్ చొరవతో సర్కారు చకచకా నడుస్తున్నాయి. ధర్మారం మండలం మల్లాపూర్ వద్ద ఎస్సారెస్పీ డీ83 మెయిన్ కాల్వకు అనుబంధంగా డీ83/బీ బ్రాంచ్ కాలువ ఉన్నది. ఇక్కడి రెగ్యులేటర్ ద్వారా ధర్మారం మండలం మల్లాపూర్ శివారు నుంచి జగిత్యాల జిల్లా ఎం డపల్లి మండలం, వెల్గటూరు మండలంలోని చె గ్యాం వరదాకాలువ డీ 83/బీ బ్రాంచ్ కాల్వ సుమారు 28 కిలో మీటర్ల మేర విస్తరించి ఉన్న ది. అయితే కాలువ శిథిలం కావడం, పలుచోట్ల డ్రాపులు కూలిపోవడం, తూములు, షట్టర్లు దెబ్బతినడంతో వెల్గటూరు మండలంలోని చివరి ఆయకట్టుకు నీరందకపోవడంతో దశాబ్దాలుగా రైతులు ఇబ్బందులుపడుతున్నారు.
మంత్రి కృషితో నిధులు
ఎస్సారెస్పీ డీ83/బీ బ్రాంచ్ కాలువ శిథిలంకావడంతో ఆయకట్టుకు సాగునీరందడంలేదు. దీంతో మంత్రి కొప్పుల ఈశ్వర్ తూములు, యూటీలు, షట్టర్ల మరమ్మతు చేయాలని సంకల్పించి ఇంజినీరింగ్ అధికారులతో అంచనాలు రూపొందించి సర్కారుకు నివేదించారు. ఈ మేరకు ప్రభుత్వం రూ. 1.52 కోట్లు మంజూరు చేసింది. వీటిలో ప్రధానంగా ధర్మారం శివారులో యూటీ పునర్మిర్మాణానికి రూ. 87.6 లక్షలు, డ్రాపుల రిపేర్కు రూ.49.9 లక్షలు, తూములు, షట్టర్ల రిపేర్కు రూ. 16 లక్షలు కేటాయించారు. దీంతో టెండర్లు పూర్తికావడంతో పనులు ప్రారంభించారు.
ధర్మారం లో యూటీ పునర్మిర్మాణం
రెండేండ్ల క్రితం ధర్మారం శివారులో 9.85 కిలోమీటర్ వద్ద కాలువ అండర్ టన్నెల్ (యూటీ) గండి పడ్డది. భారీ వర్షాలకు గుట్టల నుంచి వచ్చిన వరద నీటికి యూటీ తెగి పోవడంతో వరదలో పొలాలు మునిగిపోయాయి. మంత్రి కొప్పుల స్వయంగా పరిశీలించి తాత్కాలికంగా మరమ్మతులు చేయించారు. యూటీ పునర్నిర్మాణంతోనే శాశ్వత పరిష్కారం సాధ్యమని భావించారు. ఈ మేరకు సర్కారు ద్వారా రూ.87.6 లక్షలు మంజూరు చేయించారు. జూ న్లోనే టెండర్లు పిలిచి మొదలు పెట్టిన పనులు వేగంగా సాగుతున్నాయి. 3.5/2 మీటర్ల వెడ ల్పు, 2 మీటర్ల ఎత్తు, 23 మీటర్ల పొడవుతో యూటీ నిర్మిస్తున్నారు. ఎస్సారెస్పీ ఈఈ ప్రసాద్, ఈఈ కుమార్, ఏఈఈ నరేశ్ పర్యవేక్షిస్తున్నారు.
ఈ సీజన్లో ఎస్సారెస్పీ నీరు విడుదలయ్యేలోగా పూర్తిచేసేదిశగా చర్యలు చేపడుతున్నారు. అలాగే డ్రాపులు, షట్టర్ల మరమ్మతుకు రూ. 49.9లక్షలు కేటాయించి ఇప్పటికే పనులు మొదలు పెట్టారు. మల్లాపూర్ శివారులో 1ఎల్డీపీ మరమ్మతు, కటికెనపల్లి శివారులో 4వ కిలో మీటర్ వద్ద 2 డ్రాపులు, ఎర్రగుంటపల్లి శివారులో 8.15 కిలో మీటర్ వద్ద 1 డ్రాప్, 8.25 కిలో మీటర్ వద్ద మరొక డ్రాప్ నిర్మాణం, కాల్వ సీసీ లైనింగ్ పనులు వేగంగా సాగుతున్నాయి. రూ. 16లక్షలతో షట్టర్ల పనులు కొనసాగుతున్నాయి. చెడిపోయిన వాటిని తొలగించి కొత్త షటర్లు డీపీలకు బిగిస్తున్నారు. క్రాస్ రెగ్యులేటర్లు, ప్లాట్ఫాం షట్టర్లు బిగించారు. దీంతో ఈ పనులు చివరి దశలో ఉన్నాయి. మొత్తం మీద ఈ కాలువ మరమ్మతు పనులు జరగడం తో చివరి ఆయకట్టుకు నీరందుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చివరి ఆయకట్టుకు నీరందించేందుకే..
ఎస్సారెస్పీ డీ83/బీ బ్రాంచ్ కాలువ ద్వారా చివరి ఆయకట్టుకు నీరందించేందుకే మరమ్మతులు చేపట్టాం. దశాబ్దాలుగా రైతులు అరిగోసపడుతున్నారు. కానీ సమైక్య పాలకులు పట్టించుకోలేదు. తాను ప్రత్యేక శ్రద్ధ చూపి సర్కారు ద్వారా నిధులు మంజూరు చేయించిన. వేగంగా పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే పూర్తి చేసి చివరి ఆయకట్టు రైతాంగానికి నీరందిస్తాం.
– రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్