Odela | ఓదెల, జులై 16 : ప్రస్తుత వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల గ్రామాల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో పవిత్ర కోరారు. ఓదెల, కొలనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆమె గురువారం సందర్శించారు. డీఎంహెచ్వోగా బాధ్యతలు చేపట్టి మొదటిసారి వచ్చిన సందర్భంగా వైద్య సిబ్బంది పుష్పగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. పీహెచ్సీలలో పేద ప్రజలకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు వర్షాకాలంలో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని కోరారు.
దావఖానకు వచ్చిన పేషెంట్ ను మంచిగా చూసుకోవాలని సూచించారు. వైద్య వృత్తిలో నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. కాగా కొలనురులో పని చేస్తున్న వైద్యాధికారి డాక్టర్ సంజనేష్ ను పెద్దపల్లికి వేసిన డిప్యూటేషన్ రద్దు చేసి కొలనూరులోనే ఉంచాలని పలువురు డీఎంహెచ్వోను కోరారు. డీఎంహెచ్వో వెంట డాక్టర్లు సహబాజ్ ఖాన్, సంజనేష్, లక్ష్మీ భవాని, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.