‘మొగులుకు చిల్లులు పడ్డాయా..వరుణుడు పగబట్టాడా’ అన్నట్లు వర్షం బీభత్సం సృష్టించింది. హుజూరాబాద్ నియోజకవర్గవ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి గురువారం రాత్రిదాకా ఎడతెరిపిలేకుండా దంచికొట్టింది. ఏకధాటిగా కుండపోత పోయడంతో జనజీవనం స్తంభించింది. ఊర్లల్లో వరదనీరు ఏరులైపారింది. జమ్మికుంటలో ఏకంగా 31.28 సెంటీమీటర్ల రికార్డుస్థాయిలో కుంభవృష్టి కురిసింది. అంచనాలకు మించి వాన పడడంతో అధికార యంత్రాంగం అప్రమ త్తమైంది.. ఎక్కడికక్కడ పక్కాగా సహాయక చర్యలు చేపట్టింది. ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు చేపట్టడంలో సఫలీకృతమైంది. వావిలాలోవరదల్లో చిక్కుకున్న 80 మంది బీహర్, జార్ఖండ్ కార్మికులను కాపాడింది.
– హుజూరాబాద్టౌన్/ రూరల్/జమ్మికుంట/సైదాపూర్/ వీణవంక, జూలై 27:
హుజూరాబాద్/ హుజూరాబాద్టౌన్,జులై 27: హుజూరాబాద్ పట్టణం, మండలంలో గురువారం ఉదయం వరకు 27.88 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వరదనీరు చేరికతో గుండ్ల, మోడల్ చెరువులు మత్తళ్లు దుంకాయి. చిలుకవాగు ఉప్పొంగింది. బతుకమ్మసౌళ్ల వద్ద బతుకమ సౌళ్లు, రంగనాయకుల గుట్ట వద్ద గల కల్వర్డులపై నుంచి వరద పారింది. దీంతో గుండచెరువుకు గండి పడే ప్రమాదం ఏర్పడింది. బల్దియా చైర్పర్స్ రాధిక, కమిషనర్ సమ్మయ్య, కౌన్సిలర్లు ఎక్స్కవేటర్తో బాట పక్కన గండికొట్టి నీటిని చిలుక వాగులోకి తరలించారు. అలాగే పలుచోట్ల కచ్చకాలువలు కొట్టి నీటిని తరలించారు. బల్దియా చైర్పర్సన్, కమిషనర్ మామిండ్లవాడ, ఉర్ధూ మీడియం స్కూల్, జమ్మికుంట రోడ్డులోని లోతట్టు ప్రాంతాలల్లో, 23, 29వ వార్డు పరిధిలోని గాంధీనగర్, బుడగజంగాల కాలనీలో సందర్శించి వరద నీటిని తరలింపజేయించారు.
హుజూరాబాద్ రూరల్,జూలై27: చెల్పూర్ పరిధిలోని కురుమపల్లి, జూపాక, బొత్తలపల్లి గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జూపాక వద్ద వరదలో ఓ కారు కొట్టుకుపోయింది. రంగాపూర్, కాట్రపల్లి, తుమ్మనపల్లి, సింగాపూర్ తదితర గ్రామాల్లోని ఇండ్లల్లోకి నీరు చేరింది. కేసీ క్యాంపు సమీపంలోని కరీంనగర్-వరంగల్ రహదారిపై వరద ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి.
జమ్మికుంట, జూలై 27: మున్సిపల్, మండలంలోని అన్ని గ్రామాల్లో కుండపోత వాన కురిసింది. 24 గంటల్లో రి కార్డు స్థాయిలో 312.8 ఎంఎం వర్షపాతం నమో దైంది. మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు. విలాసాగర్ మానేరువాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది.నాయినిచెరువు మత్తడి దుంకింది. వరద ఉధృతితో జమ్మికుంట-వీణవంక రహదారిపై రాకపోకలు బందయ్యాయి. పట్టణంలోని హౌసింగ్బోర్డు, అంబేద్కర్కాలనీల్లో వరద నీరు చేరింది. బాధితులను మున్సిపల్ చైర్మన్ టీ రాజేశ్వర్రావు ఆధ్వర్యంలో అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానిక సువర్ణ ఫంక్షన్ హా ల్లో అన్నపూర్ణ సేవా సమితి భోజన వసతి కల్పించింది. ఆర్డీవో హరిసింగ్, ఇరిగేషన్ డీఈ హరిప్రసాద్, తహసీల్దార్ రాజేశ్వరి వరద ప్రాంతాల్లో పర్యటించారు.
ఇల్లందకుంట జూలై27: సిరిసేడు విద్యుత్సబ్ స్టే షన్లో నీరు చేరడంతో కరెంట్ సరఫరా నిలిపివేశారు. వంతడుపులలో చెరువుమత్తడితో ఆర్ఎన్ బీ రోడ్డు తెగి పోయింది. మల్యాల, పాతర్లపల్లి వాగు ఉధృతంగా ప్రవ హిస్తుంది. శ్రీరాంలపల్లిలో నీరు ఇళ్లలోకి రావడంతో ప్ర జలను తహసీల్దార్ సురేఖ, ఏసీపీ జీవన్రెడ్డి, సీఐ కిషోర్ పాఠశాలకు తరలించారు. సైదాపూర్, జూలై27: మండలంలో 201.8 ఎంఎం వర్షపాతం నమోదైంది. సోమారం, ఎక్లాస్పూర్, సైదాపూ ర్, రాములపల్లి, గొడిశాల కల్వర్టుల మీదుగా వరదనీరు ప్రవాహంతో సైదాపూర్ నుంచి హుజూరాబాద్కు రాకపోకలు నిలిచిపోయాయి. రాయికల్ జలపాతం జాలువారుతున్నది. సోమారం మాడల్స్కూల్ పరిసరాలు జలమయమయ్యాయి. ఎస్ఐ ఆరోగ్యం చేరుకుని సుమారు వి ద్యార్థులను ఇంటికి పంపించారు. వెన్కేపల్లి తుమ్మల చెరువు కట్టుకాలువ తెగే అవకాశం ఉండడం తో ఎస్ఐ ఆరోగ్యం, తహసీల్దార్ బావ్సింగ్ ఆధ్వర్యంలో మరమ్మత్తులు చేపట్టారు.
వీణవంక, జూలై 27: నర్సింగాపూర్, కనపర్తి, ల స్మక్కపల్లి, మామిడాలపల్లి , కోర్కల్ గ్రామాల్లోని ముంపు ప్రాంతాల్లో వీధులతో పాటు, ఇండ్లల్లోకి నీరు చేరింది. చల్లూరు గ్రామంలో పాషకు చెందిన ఇంటి పైకప్పు కూలి పడగా, వీణవంకలో పుల్లూరి లక్ష్మీ, వోరెం సుగుణాకర్ ఇంటి గోడలు కూలి పోయి ఆస్తి నష్టం జరుగగా ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు.జోరువానకు ఇటీవల వేసిన వ రినాట్లు పూర్తిగా నీట మునుగగా రోడ్లపై నుండి నీరు ప్రవ హిస్తుండడంతో వీణవంక-జమ్మికుంట, కనపర్తి-వీ ణవంక, బేతిగల్-కనపర్తి, బేతిగల్-జమ్మికుంట, పోతి రెడ్డిపల్లి-జమ్మికుంట, గంగారం-ఎలుబాక, శ్రీ రాములపేట-కోర్కల్ , వీణవంక-నర్సింగాపూర్ గ్రామా ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బొంతుపల్లి గ్రామంలో కుంటతెగిపోయే పరిస్థితిని గమనించిన సర్పంచ్ చదువు మహేందర్ రెడ్డి మరమ్మతు చేయించారు. తహసీల్దార్ రాజయ్య, ఎస్ఐ శేఖర్రెడ్డి మానేరు పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు కల్వల ప్రాజెక్ట్ తెగిపోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.అత్యవరమైతే తప్పా ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని , ఎలాంటి ప్రమాదాలు జరిగిన, సహాయం అవసరమైన వెంటనే అధికారులకు సమాచారం అందించాలని తహసీల్దార్ రాజయ్య, ఎస్ఐ ఎండీ ఆసిఫ్ కోరారు.